Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలి: మహిళా కాంగ్రెస్ డిమాండ్ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 07:24 PM

వంద పడకల ఆసుపత్రి కోసం దీక్షకు పద్మశాలి సంఘం మద్దతు

వంద పడకల ఆసుపత్రి కోసం దీక్షకు పద్మశాలి సంఘం మద్దతు

వంద పడకల ఆసుపత్రి కోసం దీక్షకు పద్మశాలి సంఘం మద్దతు
March 18, 2026 07:11 PM 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని కోరుతూ సిపిఐ(ఎం) పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరవధిక నిరాహార దీక్ష మూడో రోజుకు చేరుకుంది. ఈ దీక్షకు వివిధ వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది.

బుధవారం స్థానిక పట్టణ పద్మశాలి సంఘం నాయకులు దీక్ష శిబిరాన్ని సందర్శించి, దీక్షకారులకు సంఘీభావం తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధి ప్రాంత ప్రజలకు అత్యవసరమని పేర్కొంటూ, తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు.

ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు రచ్చ యాదగిరి, ప్రధాన కార్యదర్శి కారం కొండ నాగభూషణ్ మాట్లాడుతూ, రామన్నపేటలో మెరుగైన వైద్య సదుపాయాల కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో మహేశ్వరం అశోక్, కైరం కొండ నందకుమార్, కొంగరి నరసింహ, చిందం ఉమాకాంతం, గూడెళ్లి దామోదర్, అప్పం లింగస్వామి, గండూరి నరేష్, అప్పం సంతోష్, గంజి అశోక్ తదితరులు పాల్గొన్నారు.

దీక్ష శిబిరం ప్రశాంతంగా కొనసాగుతోంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News