Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 12:06 AM

వంద పడకల ఆసుపత్రి కోసం దీక్షకు పద్మశాలి సంఘం మద్దతు

వంద పడకల ఆసుపత్రి కోసం దీక్షకు పద్మశాలి సంఘం మద్దతు

వంద పడకల ఆసుపత్రి కోసం దీక్షకు పద్మశాలి సంఘం మద్దతు
18-03-2026 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని కోరుతూ సిపిఐ(ఎం) పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరవధిక నిరాహార దీక్ష మూడో రోజుకు చేరుకుంది. ఈ దీక్షకు వివిధ వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది.

బుధవారం స్థానిక పట్టణ పద్మశాలి సంఘం నాయకులు దీక్ష శిబిరాన్ని సందర్శించి, దీక్షకారులకు సంఘీభావం తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధి ప్రాంత ప్రజలకు అత్యవసరమని పేర్కొంటూ, తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు.

ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు రచ్చ యాదగిరి, ప్రధాన కార్యదర్శి కారం కొండ నాగభూషణ్ మాట్లాడుతూ, రామన్నపేటలో మెరుగైన వైద్య సదుపాయాల కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో మహేశ్వరం అశోక్, కైరం కొండ నందకుమార్, కొంగరి నరసింహ, చిందం ఉమాకాంతం, గూడెళ్లి దామోదర్, అప్పం లింగస్వామి, గండూరి నరేష్, అప్పం సంతోష్, గంజి అశోక్ తదితరులు పాల్గొన్నారు.

దీక్ష శిబిరం ప్రశాంతంగా కొనసాగుతోంది.

Sthanikam

వంద పడకల ఆసుపత్రి కోసం దీక్షకు పద్మశాలి సంఘం మద్దతు

Article Image

రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని కోరుతూ సిపిఐ(ఎం) పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరవధిక నిరాహార దీక్ష మూడో రోజుకు చేరుకుంది. ఈ దీక్షకు వివిధ వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది.

బుధవారం స్థానిక పట్టణ పద్మశాలి సంఘం నాయకులు దీక్ష శిబిరాన్ని సందర్శించి, దీక్షకారులకు సంఘీభావం తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధి ప్రాంత ప్రజలకు అత్యవసరమని పేర్కొంటూ, తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు.

ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు రచ్చ యాదగిరి, ప్రధాన కార్యదర్శి కారం కొండ నాగభూషణ్ మాట్లాడుతూ, రామన్నపేటలో మెరుగైన వైద్య సదుపాయాల కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో మహేశ్వరం అశోక్, కైరం కొండ నందకుమార్, కొంగరి నరసింహ, చిందం ఉమాకాంతం, గూడెళ్లి దామోదర్, అప్పం లింగస్వామి, గండూరి నరేష్, అప్పం సంతోష్, గంజి అశోక్ తదితరులు పాల్గొన్నారు.

దీక్ష శిబిరం ప్రశాంతంగా కొనసాగుతోంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News