Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 18, 2026 09:03 PM

వంద పడకల ఆసుపత్రి కోసం దీక్షకు పద్మశాలి సంఘం మద్దతు

వంద పడకల ఆసుపత్రి కోసం దీక్షకు పద్మశాలి సంఘం మద్దతు

వంద పడకల ఆసుపత్రి కోసం దీక్షకు పద్మశాలి సంఘం మద్దతు
March 18, 2026 07:11 PM 10 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని కోరుతూ సిపిఐ(ఎం) పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరవధిక నిరాహార దీక్ష మూడో రోజుకు చేరుకుంది. ఈ దీక్షకు వివిధ వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది.

బుధవారం స్థానిక పట్టణ పద్మశాలి సంఘం నాయకులు దీక్ష శిబిరాన్ని సందర్శించి, దీక్షకారులకు సంఘీభావం తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధి ప్రాంత ప్రజలకు అత్యవసరమని పేర్కొంటూ, తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు.

ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు రచ్చ యాదగిరి, ప్రధాన కార్యదర్శి కారం కొండ నాగభూషణ్ మాట్లాడుతూ, రామన్నపేటలో మెరుగైన వైద్య సదుపాయాల కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో మహేశ్వరం అశోక్, కైరం కొండ నందకుమార్, కొంగరి నరసింహ, చిందం ఉమాకాంతం, గూడెళ్లి దామోదర్, అప్పం లింగస్వామి, గండూరి నరేష్, అప్పం సంతోష్, గంజి అశోక్ తదితరులు పాల్గొన్నారు.

దీక్ష శిబిరం ప్రశాంతంగా కొనసాగుతోంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News