వివోఏలకు రూ.20 వేల కనీస వేతనం ఇవ్వాలి మిర్యాలగూడలో జేఏసీ ఆధ్వర్యంలో నిరసన
వివోఏలకు రూ.20 వేల కనీస వేతనం ఇవ్వాలి మిర్యాలగూడలో జేఏసీ ఆధ్వర్యంలో నిరసన
Editor Desk
మిర్యాలగూడ: వివోఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు మిర్యాలగూడ మండల వివోఏలు గత 20 రోజులుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షురాలు కప్పల లక్ష్మి మాట్లాడుతూ.. వివోఏలకు కనీస వేతనం రూ.20 వేలుగా నిర్ణయించాలని ప్రభుత్వాన్ని కోరారు. వివోఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అర్హులైన వివోఏలకు సీసీలుగా పదోన్నతులు కల్పించడంతో పాటు రూ.20 లక్షల వరకు ఆరోగ్య బీమా అందించాలని కోరారు. యాప్ సౌకర్యం కల్పించి, జీవో 58ను సవరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కుంటూ చంద్రకళ, కోశాధికారి బానోత్ జాన్ నాయక్, ఉపాధ్యక్షుడు మట్టపల్లి శేఖర్, సహాయ కార్యదర్శులు బొజ్జ సువాసిని, సామ శైలజ, కార్యవర్గ సభ్యులు, వివిధ గ్రామాలకు చెందిన వివోఏలు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి