వివాహ వేడుకలో నాయకుల సందడి
వివాహ వేడుకలో నాయకుల సందడి
Biksham
నూతన వధూవరులకు ఆశీస్సులు
సూర్యాపేట పట్టణం: పట్టణంలోని జివివి వేడుక మందిరంలో దాసాయి గూడెం గ్రామానికి చెందిన గుండెబోయిన వీరయ్య కుమారుని వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది.ఈ వేడుకకు ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్, మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా వారు వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేసి, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సూర్యాపేట మండల పార్టీ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి, చింతమళ్ల రమేష్, కక్కిరెని శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్లు చిలుముల సునీల్ రెడ్డి, కొండపల్లి దిలీప్ రెడ్డి, గుణగంటి హేమ సతీష్, తంగేళ్ల కరుణాకర్ రెడ్డి, వల్దాసు శ్రీను, ఆలేటి మాణిక్యం, పడిదల రవి, నారాయణ ప్రవీణ్ రెడ్డి, రాచకొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి