నూతన వధూవరులకు ఆశీస్సులు తెలిపిన సర్పంచ్ గర్దాస్ విక్రమ్
భువనగిరి, : శాసన మండలి మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్ పలు వివాహ కార్యక్రమాల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆయనతో కలిసి ఇంద్రపాలనగరం సర్పంచ్ గర్దాస్ విక్రమ్ కూడా హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
బాటసింగారం పద్మశ్రీ ఫంక్షన్ హాల్లో జరిగిన ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన తెడ్డు వెంకటేశం కుమారుడు వినయ్ – నిఖితల వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.
అలాగే ఆర్బీఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన భువనగిరి దాసు కుమారుడు రజినీకాంత్ – సమితల వివాహ కార్యక్రమానికి హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి