Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆడదాకులపల్లిలో రెవెన్యూ సమస్యల పరిష్కార వేదిక బిగ్ బ్రేకింగ్ న్యూస్ తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు దిశగా కీలక ముందడుగు కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్పొరేట్ స్థాయికి ప్రభుత్వ పాఠశాలలు – ప్రతిభావంతుల సత్కారం డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 07, 2026 08:16 PM

విపత్తుల నిర్వహణలో ప్రతి శాఖ కీలక పాత్ర పోషించాలి

విపత్తుల నిర్వహణలో ప్రతి శాఖ కీలక పాత్ర పోషించాలి

విపత్తుల నిర్వహణలో ప్రతి శాఖ కీలక పాత్ర పోషించాలి
May 07, 2026 07:01 PM 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జిల్లాలో పరిశ్రమల ప్రమాదాలు, వరదలు, అటవీ అగ్నిప్రమాదాలు వంటి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసి మాక్ విన్యాసాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వీడియో సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విపత్తులు సంభవించిన సమయంలో అధికారులు సమన్వయంతో వేగంగా స్పందించి ప్రజలకు తక్షణ సహాయం అందించేలా అన్ని శాఖలు ముందుగానే సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ నెల 18న రాష్ట్రవ్యాప్తంగా మాక్ విన్యాసాలు నిర్వహించనున్న నేపథ్యంలో ప్రతి శాఖ తమ బాధ్యతలను స్పష్టంగా తెలుసుకుని అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని తెలిపారు.జిల్లాలో పరిశ్రమల ప్రాంతాలు అధికంగా ఉన్నందున ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రమాదాల సమయంలో పాటించాల్సిన విధానాలపై స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ప్రజలకు తక్షణ సహాయం, పునరావాసం, పునరుద్ధరణ చర్యలు అందించేందుకు అన్ని శాఖలు పరస్పర సహకారంతో పనిచేయాలని పేర్కొన్నారు. భద్రతా చర్యలను కచ్చితంగా అమలు చేసి ప్రమాదాలను ముందుగానే నివారించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు కలెక్టర్లు సంగీత, పాండు, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, అగ్నిమాపక శాఖ, పరిశ్రమల శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, రవాణా శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, మున్సిపల్ శాఖ తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News