విప్లవ వీరుడు భగత్ సింగ్, కవి సిద్ధప్ప వరకవి స్మృతిలో ఘన నివాళి
విప్లవ వీరుడు భగత్ సింగ్, కవి సిద్ధప్ప వరకవి స్మృతిలో ఘన నివాళి
Prabhakar
విప్లవ వీరుడు భగత్ సింగ్, కవి సిద్ధప్ప వరకవి స్మృతిలో ఘన నివాళి
మానవసేవే మాధవసేవ గ్రూప్ ఆధ్వర్యంలో
సోమవారం మల్కాజ్గిరి నియోజకవర్గం, గౌతమ్ నగర్ డివిజన్లోని వీధి నెం. 28లో విప్లవ వీరుడు భగత్ సింగ్ 95వ వర్థంతి, తెలంగాణ తొలి సమాజ కవి సిద్ధప్ప వరకవి 42వ వర్థంతి సందర్భంగా స్మారక కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు ఈ ఇద్దరు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి గౌరవ నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్ త్యాగం, సమాజంలో చైతన్యం తీసుకొచ్చిన సిద్ధప్ప వరకవి సాహిత్య సేవలను గుర్తు చేసుకున్నారు.అధ్యక్షుడు కుమ్మరి రాజు మాట్లాడుతూ, మహానుభావుల జీవితాలు నేటి యువతకు ఆదర్శంగా నిలవాలని, వారి జయంతులు, వర్థంతులు నిర్వహించడం ద్వారా సమాజంలో చైతన్యం పెరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇస్తారి, సాంబరాజు, భాస్కర్, మహేష్ ముదిరాజ్, చైతన్య , భారత్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి