వినియోగదారుల మన్ననలే సంస్థల అభివృద్ధికి పునాది రాయల్ కార్ వాష్ షోరూం ప్రారంభించిన సర్వోత్తమ్ రెడ్డి
వినియోగదారుల మన్ననలే సంస్థల అభివృద్ధికి పునాది రాయల్ కార్ వాష్ షోరూం ప్రారంభించిన సర్వోత్తమ్ రెడ్డి
Biksham
వినియోగదారులకు నాణ్యమైన, మన్నికైన సేవలు అందించడం ద్వారా వారి మన్ననలు పొందాలని, అప్పుడే సంస్థలు అభివృద్ధి బాటలో పయనిస్తాయని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట పట్టణంలోని కొత్త మార్కెట్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన రాయల్ కార్ వాష్ షోరూంను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపార సంస్థలు వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించుకోవడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. సేవల నాణ్యత, వినియోగదారుల పట్ల మర్యాదపూర్వక వైఖరి, పారదర్శకత ఉంటే సంస్థలు మరింతగా అభివృద్ధి చెందుతాయని తెలిపారు.
కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, జిల్లా కాంగ్రెస్ నాయకులు మొరిశెట్టి లక్షాది తదితరులు పాల్గొన్నారు. షోరూం నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వ్యాపారంలో మరింత పురోగతి సాధించాలని ఆకాంక్షించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి