Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 04:20 AM

వినియోగదారుల హక్కులపై చైతన్యం పెంపు.జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి

వినియోగదారుల హక్కులపై చైతన్యం పెంపు.జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి

వినియోగదారుల హక్కులపై చైతన్యం పెంపు.జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి
March 18, 2026 05:54 PM 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రపంచ వినియోగదారుల దినోత్సవ కార్యక్రమంపై వచ్చిన వార్తల ప్రభావంతో వినియోగదారుల హక్కులపై అవగాహన మరింత పెరిగింది.

జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి మాట్లాడుతూ నాణ్యమైన వస్తువులు, సరైన పరిమాణం, ధర వివరాలు తెలుసుకోవడం ప్రతి వినియోగదారుడి హక్కు అని తెలిపారు. వినియోగదారుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, కల్తీ వస్తువులను అరికట్టేందుకు చట్టాలపై ప్రజల్లో అవగాహన అవసరమన్నారు.

“సురక్షితమైన ఉత్పత్తులు – నమ్మకమైన వినియోగదారులు” అనే అంశంపై జరిగిన చర్చలో నాణ్యమైన సేవలు పొందడం ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు అని స్పష్టం చేశారు. విద్యావంతులకే కాక సామాన్యులకు కూడా న్యాయం జరిగితేనే ఈ దినోత్సవానికి సార్ధకత ఉంటుందని పేర్కొన్నారు.

జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళా సంఘాలకు వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.

ఉచిత న్యాయ సేవల కోసం టోల్ ఫ్రీ నంబర్ 15100ను సంప్రదించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో రోజారాణి, హరికృష్ణ, బాలకృష్ణ, వెంకటేశ్వర్లు తదితరులు, వినియోగదారుల ఫోరం సభ్యులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News