వినియోగదారుల హక్కులపై చైతన్యం పెంపు.జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి
వినియోగదారుల హక్కులపై చైతన్యం పెంపు.జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి
స్థానికం బృందం
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రపంచ వినియోగదారుల దినోత్సవ కార్యక్రమంపై వచ్చిన వార్తల ప్రభావంతో వినియోగదారుల హక్కులపై అవగాహన మరింత పెరిగింది.
జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి మాట్లాడుతూ నాణ్యమైన వస్తువులు, సరైన పరిమాణం, ధర వివరాలు తెలుసుకోవడం ప్రతి వినియోగదారుడి హక్కు అని తెలిపారు. వినియోగదారుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, కల్తీ వస్తువులను అరికట్టేందుకు చట్టాలపై ప్రజల్లో అవగాహన అవసరమన్నారు.
“సురక్షితమైన ఉత్పత్తులు – నమ్మకమైన వినియోగదారులు” అనే అంశంపై జరిగిన చర్చలో నాణ్యమైన సేవలు పొందడం ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు అని స్పష్టం చేశారు. విద్యావంతులకే కాక సామాన్యులకు కూడా న్యాయం జరిగితేనే ఈ దినోత్సవానికి సార్ధకత ఉంటుందని పేర్కొన్నారు.
జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళా సంఘాలకు వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
ఉచిత న్యాయ సేవల కోసం టోల్ ఫ్రీ నంబర్ 15100ను సంప్రదించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రోజారాణి, హరికృష్ణ, బాలకృష్ణ, వెంకటేశ్వర్లు తదితరులు, వినియోగదారుల ఫోరం సభ్యులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి