Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 02:11 AM

వికలాంగ మహిళలకు ధైర్యమే దారి – చదువుతోనే సమాన హక్కులు

వికలాంగ మహిళలకు ధైర్యమే దారి – చదువుతోనే సమాన హక్కులు

వికలాంగ మహిళలకు ధైర్యమే దారి – చదువుతోనే సమాన హక్కులు
March 28, 2026 06:05 PM 58 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్,

మహిళా వికలాంగులు సమాజంలో ఎదుర్కొంటున్న అసమానతలను ధైర్యంగా ఎదుర్కొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని నిపుణులు పిలుపునిచ్చారు. చదువే వారికి గుర్తింపు, గౌరవం తీసుకువస్తుందని పేర్కొన్నారు.

వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మహిళా వికలాంగుల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న 10 మంది మహిళా వికలాంగులకు ‘స్ఫూర్తి అవార్డులు’ ప్రదానం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.

ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎల్ఐసీ కమ్యూనిటీ కోఆర్డినేటర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ… వికలాంగులపై ఉన్న వివక్షతను అధిగమించాలంటే విద్య ఒక్కటే మార్గమన్నారు. విద్య ద్వారా సామాజిక గౌరవం పెరుగుతుందని, వారి ప్రతిభను వెలికి తీయాల్సిన అవసరం ఉందన్నారు. భీమా సేవలు ప్రతి ఒక్కరికీ భరోసా కల్పిస్తాయని తెలిపారు.

ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు టి.జ్యోతి మాట్లాడుతూ… మహిళా వికలాంగులపై జరుగుతున్న లైంగిక వేధింపులు, వివక్షను అరికట్టేందుకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సంక్షేమ పథకాల అమల్లో వారికి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం.అడివయ్య మాట్లాడుతూ… వికలాంగుల హక్కుల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. పెన్షన్ల పెంపు, కొత్త పింఛన్ల మంజూరు వెంటనే చేపట్టాలని కోరారు.

ప్రముఖ వైద్యురాలు డాక్టర్ నళిని మాట్లాడుతూ… మహిళా వికలాంగుల్లో ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. సరైన జాగ్రత్తలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు, మహిళా వికలాంగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News