Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లోక్ అదాలత్‌లో భారీగా కేసుల పరిష్కారం – 545 కేసులు రాజీతో ముగింపు అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ పుస్తకాల కోసం ఇల్లు కట్టిన విశ్వ రత్న: డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ అక్షర యాత్ర “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” 6లోగా అప్లై చేసుకోండి – జర్నలిస్టులకు అక్రెడిటేషన్ గడువు శ్రీరామ నవమి సందర్భంగా సుద్దకుంటపల్లి గ్రామంలో ఆంజనేయస్వామి విగ్రహ ఊరేగింపు ఘనంగా “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 28, 2026 07:43 PM

వికలాంగ మహిళలకు ధైర్యమే దారి – చదువుతోనే సమాన హక్కులు

వికలాంగ మహిళలకు ధైర్యమే దారి – చదువుతోనే సమాన హక్కులు

వికలాంగ మహిళలకు ధైర్యమే దారి – చదువుతోనే సమాన హక్కులు
March 28, 2026 06:05 PM 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్,

మహిళా వికలాంగులు సమాజంలో ఎదుర్కొంటున్న అసమానతలను ధైర్యంగా ఎదుర్కొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని నిపుణులు పిలుపునిచ్చారు. చదువే వారికి గుర్తింపు, గౌరవం తీసుకువస్తుందని పేర్కొన్నారు.

వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మహిళా వికలాంగుల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న 10 మంది మహిళా వికలాంగులకు ‘స్ఫూర్తి అవార్డులు’ ప్రదానం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.

ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎల్ఐసీ కమ్యూనిటీ కోఆర్డినేటర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ… వికలాంగులపై ఉన్న వివక్షతను అధిగమించాలంటే విద్య ఒక్కటే మార్గమన్నారు. విద్య ద్వారా సామాజిక గౌరవం పెరుగుతుందని, వారి ప్రతిభను వెలికి తీయాల్సిన అవసరం ఉందన్నారు. భీమా సేవలు ప్రతి ఒక్కరికీ భరోసా కల్పిస్తాయని తెలిపారు.

ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు టి.జ్యోతి మాట్లాడుతూ… మహిళా వికలాంగులపై జరుగుతున్న లైంగిక వేధింపులు, వివక్షను అరికట్టేందుకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సంక్షేమ పథకాల అమల్లో వారికి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం.అడివయ్య మాట్లాడుతూ… వికలాంగుల హక్కుల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. పెన్షన్ల పెంపు, కొత్త పింఛన్ల మంజూరు వెంటనే చేపట్టాలని కోరారు.

ప్రముఖ వైద్యురాలు డాక్టర్ నళిని మాట్లాడుతూ… మహిళా వికలాంగుల్లో ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. సరైన జాగ్రత్తలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు, మహిళా వికలాంగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News