Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 06:43 AM

విజేత హై స్కూల్ లో ఘనంగా సంక్రాంతి పండుగ సంబరాలు

విజేత హై స్కూల్ లో ఘనంగా సంక్రాంతి పండుగ సంబరాలు

విజేత హై స్కూల్ లో ఘనంగా సంక్రాంతి పండుగ సంబరాలు
10-01-2026 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి కృష్ణ:

విజేత హై స్కూల్ లో ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి సంక్రాంతి పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు.శనివారం రోజు పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణంతో కళకళలాడింది.

ఈ సందర్భంగా విద్యార్థులు అందంగా ముగ్గులు వేసి తమ సృజనాత్మకతను ప్రదర్శించారు. అలాగే ఆటల పోటీలు, పట పోటీలు నిర్వహించగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..సంక్రాంతి పండుగ మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను గుర్తు చేసే ముఖ్యమైన పండుగ అని అన్నారు. ఇలాంటి పండుగల ద్వారా విద్యార్థుల్లో ఐక్యత, ఆనందం, సాంస్కృతిక విలువలు పెంపొందుతాయని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా చురుగ్గా పాల్గొనాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొని సంక్రాంతి సంబరాలను ఆనందంగా జరుపుకున్నారు.

Sthanikam

విజేత హై స్కూల్ లో ఘనంగా సంక్రాంతి పండుగ సంబరాలు

Article Image

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి కృష్ణ:

విజేత హై స్కూల్ లో ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి సంక్రాంతి పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు.శనివారం రోజు పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణంతో కళకళలాడింది.

ఈ సందర్భంగా విద్యార్థులు అందంగా ముగ్గులు వేసి తమ సృజనాత్మకతను ప్రదర్శించారు. అలాగే ఆటల పోటీలు, పట పోటీలు నిర్వహించగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..సంక్రాంతి పండుగ మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను గుర్తు చేసే ముఖ్యమైన పండుగ అని అన్నారు. ఇలాంటి పండుగల ద్వారా విద్యార్థుల్లో ఐక్యత, ఆనందం, సాంస్కృతిక విలువలు పెంపొందుతాయని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా చురుగ్గా పాల్గొనాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొని సంక్రాంతి సంబరాలను ఆనందంగా జరుపుకున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News