Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 01:48 PM

విఘ్నేశ్వర ఆలయ అభివృద్ధికి మున్సిపల్ చైర్మన్, ఉప చైర్మన్ సానుకూల స్పందన

విఘ్నేశ్వర ఆలయ అభివృద్ధికి మున్సిపల్ చైర్మన్, ఉప చైర్మన్ సానుకూల స్పందన

విఘ్నేశ్వర ఆలయ అభివృద్ధికి మున్సిపల్ చైర్మన్, ఉప చైర్మన్ సానుకూల స్పందన
March 23, 2026 02:45 PM 67 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని మొదటి వార్డులో వెలసిన శ్రీ విఘ్నేశ్వర ఆలయాన్ని సోమవారం మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, ఉప చైర్మన్ తన్నీరు మల్లికార్జున గౌడ్, కౌన్సిలర్లు సందర్శించారు.మొదటి వార్డు కౌన్సిలర్ మొదల సైదులు-కామేశ్వరి, ఆలయ కమిటీ సభ్యులు, వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆహ్వానం మేరకు వారు ఆలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా చైర్మన్, ఉప చైర్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలను స్వీకరించారు.అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆలయానికి సంబంధించిన పలు సమస్యలను, మౌలిక వసతుల కల్పనకు అవసరమైన నిధుల అంశాన్ని చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ గారు ఆలయ అభివృద్ధికి, భక్తుల సౌకర్యార్థం అవసరమైన నిధులు మంజూరు చేయడానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, వార్డు ప్రముఖులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News