విఘ్నేశ్వర ఆలయ అభివృద్ధికి మున్సిపల్ చైర్మన్, ఉప చైర్మన్ సానుకూల స్పందన
విఘ్నేశ్వర ఆలయ అభివృద్ధికి మున్సిపల్ చైర్మన్, ఉప చైర్మన్ సానుకూల స్పందన
Biksham
హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని మొదటి వార్డులో వెలసిన శ్రీ విఘ్నేశ్వర ఆలయాన్ని సోమవారం మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, ఉప చైర్మన్ తన్నీరు మల్లికార్జున గౌడ్, కౌన్సిలర్లు సందర్శించారు.మొదటి వార్డు కౌన్సిలర్ మొదల సైదులు-కామేశ్వరి, ఆలయ కమిటీ సభ్యులు, వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆహ్వానం మేరకు వారు ఆలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా చైర్మన్, ఉప చైర్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలను స్వీకరించారు.అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆలయానికి సంబంధించిన పలు సమస్యలను, మౌలిక వసతుల కల్పనకు అవసరమైన నిధుల అంశాన్ని చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ గారు ఆలయ అభివృద్ధికి, భక్తుల సౌకర్యార్థం అవసరమైన నిధులు మంజూరు చేయడానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, వార్డు ప్రముఖులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి