Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 12:00 AM

విదేశీయులు తమ దేశాలకు వెళ్లే వరకు భద్రతతో చూసుకోవాలి : ఎస్పీ

విదేశీయులు తమ దేశాలకు వెళ్లే వరకు భద్రతతో చూసుకోవాలి : ఎస్పీ

విదేశీయులు తమ దేశాలకు వెళ్లే వరకు భద్రతతో చూసుకోవాలి : ఎస్పీ
28-04-2026 72 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా జోగిపేట సబ్ జైలు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ట్రాన్సిట్ హోం (విదేశీయుల కేంద్రం)ను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. విదేశీయులు తమ దేశాలకు తిరిగి వెళ్లే వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భద్రతతో ఉంచాలని ట్రాన్సిట్ హోం అధికారులకు, సిబ్బందికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పాస్‌పోర్ట్ గడువు ముగియడం మరియు ఇతర చట్టపరమైన కారణాలతో ట్రాన్సిట్ హోంలో ఉంచబడిన విదేశీయులను సంబంధిత ప్రక్రియ పూర్తయ్యే వరకు సురక్షితంగా సంరక్షిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ట్రాన్సిట్ హోంలో 12 మంది విదేశీయులు ఉన్నారని, వారి భద్రత దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. విదేశీయులకు తగిన వసతి, ఆహారం, త్రాగునీరు, వైద్యసేవలు వంటి అవసరమైన సదుపాయాలు కల్పించి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. అలాగే ట్రాన్సిట్ హోంలో పరిశుభ్రత, భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటిస్తూ నిబంధనలకు అనుగుణంగా నిర్వహణ చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జోగిపేట సీఐ అనిల్ కుమార్, ఎస్ఐ పాండు, జైలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

విదేశీయులు తమ దేశాలకు వెళ్లే వరకు భద్రతతో చూసుకోవాలి : ఎస్పీ

Article Image

సంగారెడ్డి జిల్లా జోగిపేట సబ్ జైలు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ట్రాన్సిట్ హోం (విదేశీయుల కేంద్రం)ను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. విదేశీయులు తమ దేశాలకు తిరిగి వెళ్లే వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భద్రతతో ఉంచాలని ట్రాన్సిట్ హోం అధికారులకు, సిబ్బందికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పాస్‌పోర్ట్ గడువు ముగియడం మరియు ఇతర చట్టపరమైన కారణాలతో ట్రాన్సిట్ హోంలో ఉంచబడిన విదేశీయులను సంబంధిత ప్రక్రియ పూర్తయ్యే వరకు సురక్షితంగా సంరక్షిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ట్రాన్సిట్ హోంలో 12 మంది విదేశీయులు ఉన్నారని, వారి భద్రత దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. విదేశీయులకు తగిన వసతి, ఆహారం, త్రాగునీరు, వైద్యసేవలు వంటి అవసరమైన సదుపాయాలు కల్పించి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. అలాగే ట్రాన్సిట్ హోంలో పరిశుభ్రత, భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటిస్తూ నిబంధనలకు అనుగుణంగా నిర్వహణ చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జోగిపేట సీఐ అనిల్ కుమార్, ఎస్ఐ పాండు, జైలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News