విదేశీయులు తమ దేశాలకు వెళ్లే వరకు భద్రతతో చూసుకోవాలి : ఎస్పీ
విదేశీయులు తమ దేశాలకు వెళ్లే వరకు భద్రతతో చూసుకోవాలి : ఎస్పీ
Krishna
సంగారెడ్డి జిల్లా జోగిపేట సబ్ జైలు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ట్రాన్సిట్ హోం (విదేశీయుల కేంద్రం)ను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. విదేశీయులు తమ దేశాలకు తిరిగి వెళ్లే వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భద్రతతో ఉంచాలని ట్రాన్సిట్ హోం అధికారులకు, సిబ్బందికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పాస్పోర్ట్ గడువు ముగియడం మరియు ఇతర చట్టపరమైన కారణాలతో ట్రాన్సిట్ హోంలో ఉంచబడిన విదేశీయులను సంబంధిత ప్రక్రియ పూర్తయ్యే వరకు సురక్షితంగా సంరక్షిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ట్రాన్సిట్ హోంలో 12 మంది విదేశీయులు ఉన్నారని, వారి భద్రత దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. విదేశీయులకు తగిన వసతి, ఆహారం, త్రాగునీరు, వైద్యసేవలు వంటి అవసరమైన సదుపాయాలు కల్పించి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. అలాగే ట్రాన్సిట్ హోంలో పరిశుభ్రత, భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటిస్తూ నిబంధనలకు అనుగుణంగా నిర్వహణ చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జోగిపేట సీఐ అనిల్ కుమార్, ఎస్ఐ పాండు, జైలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి