వేసవిలో నీటి ఇబ్బందులు లేకుండా రెండు బోర్లు ఏర్పాటు
వేసవిలో నీటి ఇబ్బందులు లేకుండా రెండు బోర్లు ఏర్పాటు
Krishna
వేసవికాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా సదాశివపేట పట్టణంలోని 16వ వార్డు గొల్లకేరి ప్రాంతంలో రెండు బోర్లు ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశంలో తీసుకున్న తీర్మానం మేరకు 16వ వార్డు సభ్యురాలు కొత్తగొల్ల లావణ్య చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ పనులు చేపట్టారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు నీటి సమస్యలు తలెత్తకుండా ముందుగానే చర్యలు తీసుకోవడం పట్ల వార్డు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని సభ్యురాలు తెలిపారు. తూర్పు నిర్మల జగ్గారెడ్డి, జగ్గారెడ్డి, అలాగే పురపాలక సంఘం అధ్యక్షుడు, ఉపాధ్యక్షుల సహకారంతో ప్రజా సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొని బోర్ల ఏర్పాటు పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి