Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 04:19 AM

‘వేస్ట్ టు వెల్త్’ ప్రదర్శనతో పర్యావరణ చైతన్యం. ప్రిన్సిపాల్ డా. ఎస్. ఉపేందర్

‘వేస్ట్ టు వెల్త్’ ప్రదర్శనతో పర్యావరణ చైతన్యం. ప్రిన్సిపాల్ డా. ఎస్. ఉపేందర్

‘వేస్ట్ టు వెల్త్’ ప్రదర్శనతో పర్యావరణ చైతన్యం. ప్రిన్సిపాల్ డా. ఎస్. ఉపేందర్
March 18, 2026 04:43 PM 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నాగార్జున ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన “వేస్ట్ టు వెల్త్” ప్రదర్శనపై వచ్చిన వార్తల ప్రభావంతో పర్యావరణ పరిరక్షణపై అవగాహన మరింత పెరిగింది.

తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్ప్స్ ఆదేశాల మేరకు ఏకో క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎస్. ఉపేందర్ పాల్గొని విద్యార్థులను అభినందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యర్థాలను సంపదగా మార్చడం ద్వారా పర్యావరణాన్ని కాపాడవచ్చని, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

ఏకో క్లబ్ కన్వీనర్ వి. శిరీష మాట్లాడుతూ రోజువారీ వ్యర్థాలను పునర్వినియోగ వస్తువులుగా మార్చడం ద్వారా ప్రకృతిని సంరక్షించవచ్చని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఈ ప్రదర్శనలో విద్యార్థులు తయారు చేసిన వినూత్న వస్తువులు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కె. శివరాణి, డా. పి. సిద్ధేశ్ గౌడ్, డా. డి. కృష్ణ తదితరులు, బోధన సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం ద్వారా పర్యావరణ పరిరక్షణపై సమాజంలో చైతన్యం పెంచాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.



మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News