Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
50 ఏళ్లకే పింఛన్ ఇవ్వాలి. “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 02:15 PM

వీరేశలింగం సేవలు ఆదర్శనీయం. వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

వీరేశలింగం సేవలు ఆదర్శనీయం. వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

వీరేశలింగం సేవలు ఆదర్శనీయం.  వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
27-05-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్,: సంఘ సంస్కర్త, గద్య తిక్కన కందుకూరి వీరేశలింగం పంతులు వర్ధంతి సందర్భంగా పలువురు విద్యావేత్తలు హైదరాబాద్‌లోని ఆయన గృహాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన వక్తలు.. వీరేశలింగం పంతులు స్త్రీ విద్యాభివృద్ధి, వితంతు వివాహాల ప్రోత్సాహం, బాల్య వివాహాల నిర్మూలన కోసం విశేష కృషి చేశారని కొనియాడారు. హితకారిణీ సమాజం, వివేకవర్ధిని పత్రిక ద్వారా తెలుగు సమాజంలో చైతన్యం నింపారని పేర్కొన్నారు.

తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, నవ్యాంధ్రకు ఆధునిక భావాలను పరిచయం చేసిన మహనీయుడిగా చరిత్రలో నిలిచిపోయారని అభివర్ణించారు. యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ సంస్కరణల దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

అనంతరం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రంథాలయ సంఘం సభ్యులు, డాక్టర్ దుర్గాప్రసాద్, డాక్టర్ రవికుమార్ చేగొని, డాక్టర్ పి. విజయ్‌కుమార్, డాక్టర్ యాకూబ్ మాతంగి, డాక్టర్ పి. నాగరాజు, డాక్టర్ సిహెచ్. మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వీరేశలింగం సేవలు ఆదర్శనీయం. వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

Article Image

హైదరాబాద్,: సంఘ సంస్కర్త, గద్య తిక్కన కందుకూరి వీరేశలింగం పంతులు వర్ధంతి సందర్భంగా పలువురు విద్యావేత్తలు హైదరాబాద్‌లోని ఆయన గృహాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన వక్తలు.. వీరేశలింగం పంతులు స్త్రీ విద్యాభివృద్ధి, వితంతు వివాహాల ప్రోత్సాహం, బాల్య వివాహాల నిర్మూలన కోసం విశేష కృషి చేశారని కొనియాడారు. హితకారిణీ సమాజం, వివేకవర్ధిని పత్రిక ద్వారా తెలుగు సమాజంలో చైతన్యం నింపారని పేర్కొన్నారు.

తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, నవ్యాంధ్రకు ఆధునిక భావాలను పరిచయం చేసిన మహనీయుడిగా చరిత్రలో నిలిచిపోయారని అభివర్ణించారు. యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ సంస్కరణల దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

అనంతరం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రంథాలయ సంఘం సభ్యులు, డాక్టర్ దుర్గాప్రసాద్, డాక్టర్ రవికుమార్ చేగొని, డాక్టర్ పి. విజయ్‌కుమార్, డాక్టర్ యాకూబ్ మాతంగి, డాక్టర్ పి. నాగరాజు, డాక్టర్ సిహెచ్. మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News