వీరేశలింగం సేవలు ఆదర్శనీయం. వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
వీరేశలింగం సేవలు ఆదర్శనీయం. వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
Editor Desk
హైదరాబాద్,: సంఘ సంస్కర్త, గద్య తిక్కన కందుకూరి వీరేశలింగం పంతులు వర్ధంతి సందర్భంగా పలువురు విద్యావేత్తలు హైదరాబాద్లోని ఆయన గృహాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన వక్తలు.. వీరేశలింగం పంతులు స్త్రీ విద్యాభివృద్ధి, వితంతు వివాహాల ప్రోత్సాహం, బాల్య వివాహాల నిర్మూలన కోసం విశేష కృషి చేశారని కొనియాడారు. హితకారిణీ సమాజం, వివేకవర్ధిని పత్రిక ద్వారా తెలుగు సమాజంలో చైతన్యం నింపారని పేర్కొన్నారు.
తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, నవ్యాంధ్రకు ఆధునిక భావాలను పరిచయం చేసిన మహనీయుడిగా చరిత్రలో నిలిచిపోయారని అభివర్ణించారు. యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ సంస్కరణల దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
అనంతరం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రంథాలయ సంఘం సభ్యులు, డాక్టర్ దుర్గాప్రసాద్, డాక్టర్ రవికుమార్ చేగొని, డాక్టర్ పి. విజయ్కుమార్, డాక్టర్ యాకూబ్ మాతంగి, డాక్టర్ పి. నాగరాజు, డాక్టర్ సిహెచ్. మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి