-కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ డైరెక్టర్ క్లబ్ మెంబర్ కొండ రవీందర్
భువనగిరి మండల పరిధిలోని వీరవెల్లి గ్రామ ప్రజలకు భువనగిరి నుండి కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో ఇన్సూరెన్స్పై అవగాహన సదస్సు నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ డైరెక్టర్ క్లబ్ మెంబర్ కొండ రవీందర్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ తోటకూరి శంకరయ్య,ఉపసర్పంచ్ సర్దార్ శ్రీకాంత్ పాల్గొన్నారు.అలాగే రేగు అంజయ్య,రేగు బీరప్ప,సర్దార్ శ్రీశైలం,కంచి మహేష్,నలమాస పారిజాత,రేగు ముత్తయ్య,రేగు నరసయ్య,చందుపట్ల సాలయ్య,చిలువేరు బాల నరసింహ,రేగు మహేష్,బిమరి సతీష్,రేగు సిద్ధులు తదితర గ్రామ పెద్దలు హాజరయ్యారు.ఇక కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సీనియర్ అడ్వైజర్ నలమాస్ కుమార్,డాక్టర్లు సన్నీ,పోలపాక సురేందర్ కూడా ఈ సదస్సులో పాల్గొని,ఆరోగ్య బీమా ప్రాధాన్యతపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వారు,ఆరోగ్య బీమా ప్రతి కుటుంబానికి అవసరమని,అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక భారం తగ్గించడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. గ్రామ ప్రజలు ఈ కార్యక్రమాన్ని ఆసక్తిగా వినిపించి, ఇన్సూరెన్స్ పథకాలపై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి