వీరవెల్లి: గ్రామ ప్రజలకు శుభవార్తగా, ఈరోజు భువనగిరి నుండి కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ తరపున అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ డైరెక్టర్ క్లబ్ మెంబర్ కొండ రవీందర్ నిర్వహించారు.
ఇన్సూరెన్స్ ప్రాధాన్యత, ఆరోగ్య భద్రత, కుటుంబ ఆర్థిక రక్షణ వంటి అంశాలపై గ్రామ ప్రజలకు వివరంగా అవగాహన కల్పించారు. అనుకోని ఆరోగ్య సమస్యల సమయంలో ఇన్సూరెన్స్ ఎలా సహాయపడుతుందో వివరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ తోటకూరి శంకరయ్య హాజరై మాట్లాడుతూ, ప్రతి కుటుంబం ఆరోగ్య బీమా పొందడం ఎంతో అవసరమని సూచించారు. ఉపసర్పంచ్ సర్దార్ శ్రీకాంత్ కూడా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో రేగు అంజయ్య, రేగు బీరప్ప, సర్దార్ శ్రీశైలం, కంచి మహేష్, నలమాస పారిజాత, రేగు ముత్తయ్య, రేగు నరసయ్య, చందుపట్ల సాలయ్య, చిలువేరు బాల నరసింహ, రేగు మహేష్, బిమరి సతీష్, రేగు సిద్ధులు తదితరులు పాల్గొన్నారు.
అలాగే కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సీనియర్ అడ్వైజర్ నలమాస్ కుమార్, డాక్టర్స్ సన్నీ, పోలపాక సురేందర్ గారు పాల్గొని ప్రజలకు అవసరమైన సూచనలు అందించారు.
ఈ అవగాహన సదస్సుకు గ్రామ ప్రజలు మంచి స్పందన చూపగా, భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని నిర్వాహకులు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి