Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హమాలి కార్మికుల శ్రమ దోపిడీపై ఆగ్రహం సిఐటియు పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 07:51 AM

వెలుగుమట్ల బాధితులకు కేటీఆర్ భరోసా

వెలుగుమట్ల బాధితులకు కేటీఆర్ భరోసా

వెలుగుమట్ల బాధితులకు కేటీఆర్ భరోసా
February 26, 2026 06:50 PM 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సుప్రీం న్యాయస్థానం వరకూ వెళ్లి పోరాడతాం

మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇల్లు కట్టిస్తాం – కేటీఆర్ హామీ

ఖమ్మం వెలుగుమట్ల ప్రాంతంలో జరిగిన అక్రమ కూల్చివేతలతో ఇబ్బందులు పడుతున్న బాధిత కుటుంబాలకు బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారు. బాధితులను పరామర్శించిన ఆయన వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ బాధితుల కోసం అవసరమైతే సుప్రీం న్యాయస్థానం వరకూ వెళ్లి పోరాడతామని స్పష్టం చేశారు. ప్రజలకు అన్యాయం జరిగితే బీఆరెస్ నిశ్శబ్దంగా ఉండదని, చట్టపరంగా, ప్రజాస్వామ్యపరంగా పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. మా ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇదే స్థలంలో మీకు ఇల్లు కట్టించి గృహప్రవేశాలు చేసే బాధ్యత మాది అని హామీ ఇచ్చారు. ఒక్క కుటుంబం కూడా రోడ్డున పడకుండా చూసుకుంటామని అన్నారు. అక్రమ కూల్చివేతల అంశాన్ని శాసనసభ, శాసనమండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని తెలిపారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. బాధిత కుటుంబాలు తమకు అండగా నిలిచినందుకు కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News