Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 02:38 PM

వెలుగుమట్ల బాధితులకు కేటీఆర్ భరోసా

వెలుగుమట్ల బాధితులకు కేటీఆర్ భరోసా

వెలుగుమట్ల బాధితులకు కేటీఆర్ భరోసా
February 26, 2026 06:50 PM 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సుప్రీం న్యాయస్థానం వరకూ వెళ్లి పోరాడతాం

మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇల్లు కట్టిస్తాం – కేటీఆర్ హామీ

ఖమ్మం వెలుగుమట్ల ప్రాంతంలో జరిగిన అక్రమ కూల్చివేతలతో ఇబ్బందులు పడుతున్న బాధిత కుటుంబాలకు బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారు. బాధితులను పరామర్శించిన ఆయన వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ బాధితుల కోసం అవసరమైతే సుప్రీం న్యాయస్థానం వరకూ వెళ్లి పోరాడతామని స్పష్టం చేశారు. ప్రజలకు అన్యాయం జరిగితే బీఆరెస్ నిశ్శబ్దంగా ఉండదని, చట్టపరంగా, ప్రజాస్వామ్యపరంగా పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. మా ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇదే స్థలంలో మీకు ఇల్లు కట్టించి గృహప్రవేశాలు చేసే బాధ్యత మాది అని హామీ ఇచ్చారు. ఒక్క కుటుంబం కూడా రోడ్డున పడకుండా చూసుకుంటామని అన్నారు. అక్రమ కూల్చివేతల అంశాన్ని శాసనసభ, శాసనమండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని తెలిపారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. బాధిత కుటుంబాలు తమకు అండగా నిలిచినందుకు కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News