వెలుగుమట్ల బాధితులకు కేటీఆర్ భరోసా
వెలుగుమట్ల బాధితులకు కేటీఆర్ భరోసా
Biksham Goud
సుప్రీం న్యాయస్థానం వరకూ వెళ్లి పోరాడతాం
మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇల్లు కట్టిస్తాం – కేటీఆర్ హామీ
ఖమ్మం వెలుగుమట్ల ప్రాంతంలో జరిగిన అక్రమ కూల్చివేతలతో ఇబ్బందులు పడుతున్న బాధిత కుటుంబాలకు బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారు. బాధితులను పరామర్శించిన ఆయన వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ బాధితుల కోసం అవసరమైతే సుప్రీం న్యాయస్థానం వరకూ వెళ్లి పోరాడతామని స్పష్టం చేశారు. ప్రజలకు అన్యాయం జరిగితే బీఆరెస్ నిశ్శబ్దంగా ఉండదని, చట్టపరంగా, ప్రజాస్వామ్యపరంగా పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. మా ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇదే స్థలంలో మీకు ఇల్లు కట్టించి గృహప్రవేశాలు చేసే బాధ్యత మాది అని హామీ ఇచ్చారు. ఒక్క కుటుంబం కూడా రోడ్డున పడకుండా చూసుకుంటామని అన్నారు. అక్రమ కూల్చివేతల అంశాన్ని శాసనసభ, శాసనమండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని తెలిపారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. బాధిత కుటుంబాలు తమకు అండగా నిలిచినందుకు కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి