Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యమకారుడు శ్రవణ్ మృతి.. కుటుంబానికి ప్రభుత్వం సాయం చేయాలి. జోగు అంజన్న ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు నరాలు తెగే ఉత్కంఠ... ఢిల్లీ చేతిలో గెలుపు.. గుజరాత్ తన్నుకుపోయింది! “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 09, 2026 09:02 PM

వెలుగు పల్లిలో 15 కోట్లతో గోదాముల నిర్మాణ పనులను చేపట్టిన; తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు.

వెలుగు పల్లిలో 15 కోట్లతో గోదాముల నిర్మాణ పనులను చేపట్టిన; తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు.

వెలుగు పల్లిలో 15 కోట్లతో గోదాముల నిర్మాణ పనులను చేపట్టిన;  తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు.
April 09, 2026 07:34 PM 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండల పరిధిలోని వెలుగుపల్లి గ్రామం శివారులో రుద్రమ్మ చెరువు వద్ద 15కోట్ల నూతన గిడ్డంగులు ఏర్పాటు కార్యక్రమంలో ఎమ్మెల్యే మందుల సామేల్ , ఏఐసీసీ సభ్యులు సర్వోత్తమ్ రెడ్డి, భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...గ్రామాల్లోని రైతుల ప్రయోజనాల కోసమే గోదాముల నిర్మాణం ప్రభుత్వం చేపట్టినట్లు వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సహకారంతో అడ్డగూడూరు కేంద్రంలో నూతనంగా పారిశ్రామిక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

నియోజకవర్గానికి అదనంగా 2000 నూతన ఇందిరమ్మ ఇండ్లు ఉచిత మహాలక్ష్మి పథకం 500 కే గ్యాస్ కనెక్షన్ సన్న బియ్యం పంపిణీ పేద ప్రజల గుండెల్లో అభివృద్ధి పథకాలు నిలిచిపోయాయని అన్నారు. మద్దిరాల, నూతనకల్ మండలాల నడుమ నూతనంగా జూనియర్ కాలేజ్ ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. వెలుగు పల్లి గ్రామానికి సుమారు గడిచిన రెండు సంవత్సరాల కాలంలో కోటి రూపాయలకు పైగా వ్యయంతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నట్టు తెలిపారు.

అనంతరం ఎఐసిసి సభ్యులు , యువనేత రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ.... కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వంలో భాగంగా గ్రామానికి నూతన గిడ్డంగుల నిర్మాణం రావడం సంతోషకరమైన విషయమని అన్నారు. దీనితో రానున్న రోజుల్లో ఉపాధి అవకాశాలు మెరుగు పడనున్నట్లు తెలిపారు. ఎక్కడ అభివృద్ధి అవకాశం ఉన్న తుంగతుర్తి సూర్యాపేట నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు, రానున్న ఎన్నికల్లో అయినా కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు.


ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు గుడిపాటి నరసయ్య ,రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి ,వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు యోగానంద చారి, మాజీ పిఎసిఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు, వెలుగుపల్లి సర్పంచ్, నియోజకవర్గ అసెంబ్లీ అధ్యక్షుడు కొరికొప్పుల నరేష్ గౌడ్, జిల్లా నాయకులు రేగటి రవి, కొండరాజు, మాచర్ల అనిల్ ,నాగరాజు, దాసు, తాసిల్దార్ దయానందం, ఎంపీడీవో శేష్ కుమార్, నాయకులు , తదితరులుపాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News