Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:13 AM

వెలిమినేడులో వైభవంగా శ్రీ శివపార్వతుల కళ్యాణం.. భక్తులకు ఆహ్వానం!

వెలిమినేడులో వైభవంగా శ్రీ శివపార్వతుల కళ్యాణం.. భక్తులకు ఆహ్వానం!

వెలిమినేడులో వైభవంగా శ్రీ శివపార్వతుల కళ్యాణం.. భక్తులకు ఆహ్వానం!
February 14, 2026 06:40 PM 114 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వెలిమినేడులో కన్నులపండువగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

రేపే శ్రీ కంఠమహేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

భక్తిభావం పరిమళించే వేళ.. శివనామస్మరణతో మారుమోగనున్న వెలిమినేడు పుణ్యక్షేత్రం!

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ సురమాంబ కంఠమహేశ్వర స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

ఈ నెల 15-02-2026 (ఆదివారం) న అత్యంత వైభవంగా జరగనున్నాయి.

విశ్వావసు నామ సంవత్సర మాఘ బహుళ త్రయోదశి పుణ్యఘడియల్లో, భక్త బృందం ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించేందుకు ఆలయ యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది.

ఆధ్యాత్మిక కార్యక్రమాల వివరాలు:

ఆదివారం ఉదయం నుంచే ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించబడతాయి:

  1. ఉదయం 06:00 గంటలకు: సుప్రభాత సేవతో ఉత్సవాల ప్రారంభం.
  2. ఉదయం 06:00 గంటలకు: గణపతి పూజ మరియు పుణ్యాహవాచనము.
  3. ఉదయం 08:00 గంటలకు: మహన్యాస పూర్వక రుద్రాభిషేకం.
  4. ఉదయం 09:00 గంటలకు: మండపారాధన.
  5. ఉదయం 11:45 గంటలకు: అత్యంత ప్రధాన ఘట్టమైన శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది.

భక్తులకు విజ్ఞప్తి:

ఈ మహాశివరాత్రి పర్వదినాన నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు గ్రామ ప్రజలు మరియు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు. స్వామివారిని దర్శించుకుని, కట్న కానుకలు సమర్పించి, తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని భక్త బృందం విజ్ఞప్తి చేస్తోంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News