వేలాడుతున్న విద్యుత్ తీగులను మరమ్మతులు చేయించాలని; రైతులు ఆందోళన
వేలాడుతున్న విద్యుత్ తీగులను మరమ్మతులు చేయించాలని; రైతులు ఆందోళన
Bandi Kiran Kumar
తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామ సమీపంలో కుక్కుడుకాయ మిట్ట పొలాల్లో విద్యుత్ తీగలు కిందకు వేలాడుతూ మృత్యు పాశాలుగా మారాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ... గతంలో ఇద్దరు రైతులకు మరియు పశువులకు షాకు తగిలిందని అన్నారు. పశువులు పొలంలో మేస్తుంటే పశువుల తోక కరెంటుతీగ తగలడంతో స్పృహ తప్పి పడిపోవడం జరిగింది. ఆ గేదకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అతి ప్రమాదకరంగా మారినఈ విద్యుత్ తీగలు వల్ల అటు రైతులుకు ఇటు పశువులకు శాఖలు తగులుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా పెద్ద ప్రమాదం జరగక ముందే మండల విద్యుత్ శాఖ అధికారి ఏడి స్పందించి వెంటనే ఈ తీగలను సరిచేసి మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరారు. ఈ కార్యక్రమంలో చింతకుంట్ల విటల్, బుద్ధ ఉప్పలయ్య, నాలి వెంకన్న, రమేష్, మురళి, చంద మహేష్, నాలి మధు, రైతులు,తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి