Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెన్షన్ కోసం వెళ్లి ప్రాణాలతో పోరాటం..! నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 13, 2026 11:36 AM

వేలాడుతున్న విద్యుత్ తీగులను మరమ్మతులు చేయించాలని; రైతులు ఆందోళన

వేలాడుతున్న విద్యుత్ తీగులను మరమ్మతులు చేయించాలని; రైతులు ఆందోళన

వేలాడుతున్న విద్యుత్ తీగులను మరమ్మతులు చేయించాలని; రైతులు ఆందోళన
May 27, 2026 05:19 PM 78 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar



తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామ సమీపంలో కుక్కుడుకాయ మిట్ట పొలాల్లో విద్యుత్ తీగలు కిందకు వేలాడుతూ మృత్యు పాశాలుగా మారాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ... గతంలో ఇద్దరు రైతులకు మరియు పశువులకు షాకు తగిలిందని అన్నారు. పశువులు పొలంలో మేస్తుంటే పశువుల తోక కరెంటుతీగ తగలడంతో స్పృహ తప్పి పడిపోవడం జరిగింది. ఆ గేదకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అతి ప్రమాదకరంగా మారినఈ విద్యుత్ తీగలు వల్ల అటు రైతులుకు ఇటు పశువులకు శాఖలు తగులుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా పెద్ద ప్రమాదం జరగక ముందే మండల విద్యుత్ శాఖ అధికారి ఏడి స్పందించి వెంటనే ఈ తీగలను సరిచేసి మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరారు. ఈ కార్యక్రమంలో చింతకుంట్ల విటల్, బుద్ధ ఉప్పలయ్య, నాలి వెంకన్న, రమేష్, మురళి, చంద మహేష్, నాలి మధు, రైతులు,తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News