Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:00 PM

వేగం వద్దు… ప్రాణం ముద్దు” – ముసునూరులో పోలీసుల హెచ్చరిక

వేగం వద్దు… ప్రాణం ముద్దు” – ముసునూరులో పోలీసుల హెచ్చరిక

వేగం వద్దు… ప్రాణం ముద్దు” – ముసునూరులో పోలీసుల హెచ్చరిక
March 09, 2026 08:19 PM 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

హెల్మెట్ లేకపోతే ప్రమాదం ఖాయం… విజిబుల్ పోలీసింగ్‌తో అప్రమత్తం చేసిన ఎస్‌ఐ చిరంజీవి

ముసునూరు : రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో అవగాహన పెంచేందుకు ముసునూరు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. “వేగం వద్దు… ప్రాణం ముద్దు” అనే నినాదంతో ముసునూరు ఎస్‌ఐ ఎం. చిరంజీవి సిబ్బందితో కలిసి పట్టణంలో విజిబుల్ పోలీసింగ్ నిర్వహించి వాహనదారులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ ఆదేశాల మేరకు, రూరల్ సీఐ కె. రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రోడ్లపై తనిఖీలు చేపట్టి ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వినియోగం ప్రాముఖ్యతను వివరించారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాద సమయంలో ప్రాణాలను కాపాడుకోవచ్చని ఎస్‌ఐ చిరంజీవి స్పష్టం చేశారు.

అధిక వేగంతో వాహనాలు నడపడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, అందుకే “వేగం వద్దు… ప్రాణం ముద్దు” అనే నినాదాన్ని ప్రతి వాహనదారుడు గుర్తుంచుకోవాలని సూచించారు.

ఆటో డ్రైవర్లు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించకూడదని, రోడ్డుపై అడ్డంగా వాహనాలు నిలిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆటోలను తప్పనిసరిగా ఆటో స్టాండ్‌లలోనే నిలపాలని సూచించారు.

మైనర్లకు వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రులపైనా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్ 112 సేవలను వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు.

సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో అపరిచిత లింకులు, ఫోన్ కాల్స్, ఓటీపీలు పంచుకోవద్దని ప్రజలకు అవగాహన కల్పించారు.

“మీ కుటుంబ సభ్యులు మీపై ఆధారపడి ఉన్నారు… కాబట్టి రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించండి. ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడమే విజిబుల్ పోలీసింగ్ లక్ష్యం” అని ఎస్‌ఐ ఎం. చిరంజీవి తెలిపారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News