Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపాలిటీకి రూ.54.75 కోట్ల బడ్జెట్ ఆమోదం అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ పుస్తకాల కోసం ఇల్లు కట్టిన విశ్వ రత్న: డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ అక్షర యాత్ర “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” 6లోగా అప్లై చేసుకోండి – జర్నలిస్టులకు అక్రెడిటేషన్ గడువు శ్రీరామ నవమి సందర్భంగా సుద్దకుంటపల్లి గ్రామంలో ఆంజనేయస్వామి విగ్రహ ఊరేగింపు ఘనంగా “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 28, 2026 10:01 PM

వీధి కుక్కల నియంత్రణపై కట్టుదిట్ట చర్యలు: కలెక్టర్ ఆదేశాలు

వీధి కుక్కల నియంత్రణపై కట్టుదిట్ట చర్యలు: కలెక్టర్ ఆదేశాలు

వీధి కుక్కల నియంత్రణపై కట్టుదిట్ట చర్యలు: కలెక్టర్ ఆదేశాలు
March 28, 2026 08:29 PM 16 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వీధి కుక్కల దాడులను నివారించి ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించేందుకు అధికారులు సమన్వయంతో కట్టుదిట్టంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.

శనివారం కలెక్టరేట్‌లోని మినీ మీటింగ్ హాల్‌లో జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్‌తో పాటు ఎస్పీ అక్షాంశ్ యాదవ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, మున్సిపల్ కమిషనర్లు, పశుసంవర్ధక శాఖ అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వీధి కుక్కల బెడద అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. కుక్కల నియంత్రణ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ప్రభావిత ప్రాంతాల్లో కుక్కలను బంధించడం, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. రేబిస్ వ్యాధి నివారణకు వీధి కుక్కలకు యాంటీ రేబిస్ టీకాలు వేయడం తప్పనిసరిగా చేపట్టాలని స్పష్టం చేశారు.

కుక్కల జనాభా నియంత్రణ కోసం విస్తృత స్థాయిలో స్టెరిలైజేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ముఖ్యంగా పాఠశాలలు, ఆసుపత్రులు, ఆర్టీసీ బస్టాండ్‌ల వంటి రద్దీ ప్రదేశాల్లో ఉన్న కుక్కలను తక్షణం నియంత్రించాలని పేర్కొన్నారు. స్టెరిలైజేషన్ అనంతరం కుక్కలను తగిన షెల్టర్లలో ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

జాతీయ రహదారులపై వీధి కుక్కలు మరియు ఇతర జంతువుల సంచారం వల్ల ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక పెట్రోలింగ్ బృందాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. అలాగే మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల పరిధిలో చెత్త నిర్వహణ సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ మాట్లాడుతూ వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ అత్యవసరమని పేర్కొన్నారు. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో క్రమం తప్పకుండా ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్లపై తిరిగే జంతువులను గుర్తించి ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి, ఆర్ అండ్ బి శాఖ అధికారి సరిత, పశుసంవర్ధక శాఖ అధికారి జానయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ, జిల్లా వైద్యశాఖ అధికారి మనోహర్, జిల్లా రవాణా శాఖ అధికారి సాయి కృష్ణ, మున్సిపల్ కమిషనర్లు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News