Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పిప్పడపల్లి గ్రామంలో హత్యాయత్నం ఘటన – నలుగురిపై కేసు నమోదు TGPSC UPSCలా మారాలి, రిటైర్మెంట్ 58కి, ₹5016 భృతి.. SC/ST బ్యాక్‌లాగ్‌తో 2L ఉద్యోగాలు: TNVP డిమాండ్లు లండన్‌లో అంబేద్కర్ మ్యూజియం భారత గొప్ప గుర్తింపు : రేలారే గంగా స్మార్ట్ మీటర్లు కాదు, స్మార్ట్ స్కూళ్లు కావాలి : రాఘవ్ చద్దా ప్రశ్న దేశ లొంగవిస్తోంది! “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” సోమందేపల్లిలో రంజాన్ శుభారంభం – భక్తి శ్రద్ధల మధ్య ర్యాలీ ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 26, 2026 10:36 PM

వ్యవసాయాన్ని కాపాడండి.. దేశాన్ని రక్షించండి: ఏఐకేఎంఎస్ పిలుపు

వ్యవసాయాన్ని కాపాడండి.. దేశాన్ని రక్షించండి: ఏఐకేఎంఎస్ పిలుపు

వ్యవసాయాన్ని కాపాడండి.. దేశాన్ని రక్షించండి: ఏఐకేఎంఎస్ పిలుపు
March 26, 2026 08:41 PM 5 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఖమ్మంలో జరిగిన అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) కేంద్ర కార్యనిర్వాహక వర్గ సమావేశంలో రైతాంగ సమస్యలపై విస్తృతంగా చర్చించారు. “వ్యవసాయాన్ని కాపాడండి.. దేశాన్ని రక్షించండి” అనే నినాదంతో ఉద్యమాలకు సిద్ధం కావాలని జాతీయ నాయకులు పిలుపునిచ్చారు.

సమావేశం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జాతీయ అధ్యక్షుడు వేములపల్లి వెంకట్రామయ్య, ప్రధాన కార్యదర్శి ఆశిష్ మిట్టల్, జాతీయ నాయకుడు రబీందర్ సింగ్ పాటియాలా పాల్గొన్నారు. సెప్టెంబర్‌లో ఖమ్మంలో జరగనున్న జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.

కేంద్ర ప్రభుత్వం రైతాంగాన్ని బలహీనపరిచే విధానాలు అమలు చేస్తోందని విమర్శించారు. కొత్త విద్యుత్ బిల్లు, విత్తన బిల్లు, ఉపాధి హామీ పథకాల మార్పులను తీవ్రంగా వ్యతిరేకిస్తూ తీర్మానాలు ఆమోదించారు. అన్ని పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) అమలు, రుణమాఫీ, ఉచిత విద్యుత్ వంటి డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు.

కార్పొరేట్ అనుకూల విధానాల వల్ల రైతులకు నష్టం జరుగుతోందని, దేశవ్యాప్తంగా రైతు ఉద్యమాలను విస్తరించనున్నట్లు తెలిపారు. భూసేకరణ, భూదాన్ భూముల సమస్యలపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు.

రాబోయే రోజుల్లో రైతు, కూలీ వర్గాల హక్కుల కోసం అఖిల భారత స్థాయిలో పోరాటాలను మరింత బలోపేతం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News