వ్యవసాయాన్ని కాపాడండి.. దేశాన్ని రక్షించండి: ఏఐకేఎంఎస్ పిలుపు
వ్యవసాయాన్ని కాపాడండి.. దేశాన్ని రక్షించండి: ఏఐకేఎంఎస్ పిలుపు
Editor Desk
ఖమ్మంలో జరిగిన అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) కేంద్ర కార్యనిర్వాహక వర్గ సమావేశంలో రైతాంగ సమస్యలపై విస్తృతంగా చర్చించారు. “వ్యవసాయాన్ని కాపాడండి.. దేశాన్ని రక్షించండి” అనే నినాదంతో ఉద్యమాలకు సిద్ధం కావాలని జాతీయ నాయకులు పిలుపునిచ్చారు.
సమావేశం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జాతీయ అధ్యక్షుడు వేములపల్లి వెంకట్రామయ్య, ప్రధాన కార్యదర్శి ఆశిష్ మిట్టల్, జాతీయ నాయకుడు రబీందర్ సింగ్ పాటియాలా పాల్గొన్నారు. సెప్టెంబర్లో ఖమ్మంలో జరగనున్న జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం రైతాంగాన్ని బలహీనపరిచే విధానాలు అమలు చేస్తోందని విమర్శించారు. కొత్త విద్యుత్ బిల్లు, విత్తన బిల్లు, ఉపాధి హామీ పథకాల మార్పులను తీవ్రంగా వ్యతిరేకిస్తూ తీర్మానాలు ఆమోదించారు. అన్ని పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) అమలు, రుణమాఫీ, ఉచిత విద్యుత్ వంటి డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు.
కార్పొరేట్ అనుకూల విధానాల వల్ల రైతులకు నష్టం జరుగుతోందని, దేశవ్యాప్తంగా రైతు ఉద్యమాలను విస్తరించనున్నట్లు తెలిపారు. భూసేకరణ, భూదాన్ భూముల సమస్యలపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు.
రాబోయే రోజుల్లో రైతు, కూలీ వర్గాల హక్కుల కోసం అఖిల భారత స్థాయిలో పోరాటాలను మరింత బలోపేతం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి