Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
50 ఏళ్లకే పింఛన్ ఇవ్వాలి. “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 03:13 PM

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడిగా జల్లెల పెంటయ్య

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడిగా జల్లెల పెంటయ్య

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడిగా జల్లెల పెంటయ్య
22-05-2026 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడిగా జల్లెల పెంటయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల రామన్నపేటలో నిర్వహించిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభల్లో ప్రతినిధులు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.కొమ్మాయిగూడెం గ్రామానికి చెందిన జల్లెల పెంటయ్య నిరుపేద గొర్రెల కాపరి కుటుంబంలో జన్మించారు. ఐడియల్ కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తూ సీఐటీయూ యూనియన్ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1998లో సీపీఎం పార్టీ సభ్యత్వం పొంది, రామన్నపేట, నకిరేకల్ డివిజన్ కమిటీ సభ్యుడిగా, వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ కార్యదర్శిగా సేవలందించారు.

అలాగే గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం ఉమ్మడి జిల్లా కార్యదర్శిగా, 2006 నుంచి 2022 వరకు సీపీఎం మండల కార్యదర్శిగా పనిచేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఏర్పాటైన తర్వాత జిల్లా కమిటీ సభ్యుడిగా, చౌటుపల్‌లో జరిగిన జిల్లా మహాసభల్లో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు.మండల వ్యాప్తంగా కూలీల సమస్యలు, భూమి పోరాటాలకు సారథ్యం వహించిన ఆయన అర్హులైన పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు దక్కేలా అనేక ఉద్యమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా జల్లెల పెంటయ్య మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఉద్యమాలను మరింత బలోపేతం చేస్తానని తెలిపారు.

Sthanikam

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడిగా జల్లెల పెంటయ్య

Article Image

రామన్నపేట,

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడిగా జల్లెల పెంటయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల రామన్నపేటలో నిర్వహించిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభల్లో ప్రతినిధులు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.కొమ్మాయిగూడెం గ్రామానికి చెందిన జల్లెల పెంటయ్య నిరుపేద గొర్రెల కాపరి కుటుంబంలో జన్మించారు. ఐడియల్ కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తూ సీఐటీయూ యూనియన్ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1998లో సీపీఎం పార్టీ సభ్యత్వం పొంది, రామన్నపేట, నకిరేకల్ డివిజన్ కమిటీ సభ్యుడిగా, వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ కార్యదర్శిగా సేవలందించారు.

అలాగే గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం ఉమ్మడి జిల్లా కార్యదర్శిగా, 2006 నుంచి 2022 వరకు సీపీఎం మండల కార్యదర్శిగా పనిచేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఏర్పాటైన తర్వాత జిల్లా కమిటీ సభ్యుడిగా, చౌటుపల్‌లో జరిగిన జిల్లా మహాసభల్లో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు.మండల వ్యాప్తంగా కూలీల సమస్యలు, భూమి పోరాటాలకు సారథ్యం వహించిన ఆయన అర్హులైన పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు దక్కేలా అనేక ఉద్యమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా జల్లెల పెంటయ్య మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఉద్యమాలను మరింత బలోపేతం చేస్తానని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News