వ్యాంగుల ఉచిత బస్సు పథకానికి స్పందన.టీడీపీ ఇంచార్జ్ మీనాక్షి నాయుడు
వ్యాంగుల ఉచిత బస్సు పథకానికి స్పందన.టీడీపీ ఇంచార్జ్ మీనాక్షి నాయుడు
స్థానికం బృందం
ఆదోని పట్టణంలోని కొత్త బస్టాండ్లో దివ్యాంగుల ఉచిత బస్సు పథకం ప్రారంభంపై వచ్చిన వార్తల ప్రభావంతో కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.
మాజీ శాసనసభ్యులు, టీడీపీ ఇంచార్జ్ మీనాక్షి నాయుడు, సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు ఆదేశాల మేరకు యువ నాయకుడు సిద్ధార్థ నాయుడు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బస్టాండ్ నుంచి ఏరియా ఆసుపత్రి వరకు దివ్యాంగులతో కలిసి కూటమి నాయకులతో ప్రయాణం చేసి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు.
సిద్ధార్థ నాయుడు మాట్లాడుతూ ఉగాది కానుకగా ఉచిత ప్రయాణ సౌకర్యం ద్వారా 11.16 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు. దివ్యాంగ శక్తి పథకం ద్వారా 12.76 లక్షల మంది దివ్యాంగులు మరియు వారి సహాయకులు ప్రయోజనం పొందనున్నారని చెప్పారు.
దివ్యాంగులకు సహాయకులుగా వచ్చే వారికి 50 శాతం టికెట్ రాయితీ ఉంటుందని, 40 శాతం పైగా వైకల్యం ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుందని వెల్లడించారు.
ఈ పథకం అమలుకు సంవత్సరానికి రూ.207 కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించనున్నట్లు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి