Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:48 PM

వట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో రోడ్డు భద్రతపై ప్రత్యేక కార్యక్రమం

వట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో రోడ్డు భద్రతపై ప్రత్యేక కార్యక్రమం

వట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో రోడ్డు భద్రతపై ప్రత్యేక కార్యక్రమం
April 11, 2026 03:27 PM 111 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna


వట్‌పల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో ఎస్సై లవ కుమార్ ఆధ్వర్యంలో శనివారం రోడ్డు భద్రతపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు హాజరై చురుకుగా పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరాన్ని ఎస్సై వివరించారు. హెల్మెట్ ధరించడం, సీటుబెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, వేగ నియంత్రణ పాటించాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు. గ్రామ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించడంలో ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం పెంచితేనే ప్రమాదాలను తగ్గించగలమని తెలిపారు. కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగి, హాజరైన వారంతా ఈ అవగాహనను గ్రామాల్లోకి తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News