Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జేతురం తండాలో నూతన రేషన్ షాప్ ప్రారంభం – ప్రజలకు ఊరట కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 05:32 PM

వట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో రోడ్డు భద్రతపై ప్రత్యేక కార్యక్రమం

వట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో రోడ్డు భద్రతపై ప్రత్యేక కార్యక్రమం

వట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో రోడ్డు భద్రతపై ప్రత్యేక కార్యక్రమం
April 11, 2026 03:27 PM 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna


వట్‌పల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో ఎస్సై లవ కుమార్ ఆధ్వర్యంలో శనివారం రోడ్డు భద్రతపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు హాజరై చురుకుగా పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరాన్ని ఎస్సై వివరించారు. హెల్మెట్ ధరించడం, సీటుబెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, వేగ నియంత్రణ పాటించాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు. గ్రామ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించడంలో ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం పెంచితేనే ప్రమాదాలను తగ్గించగలమని తెలిపారు. కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగి, హాజరైన వారంతా ఈ అవగాహనను గ్రామాల్లోకి తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News