వట్పల్లి పోలీస్ స్టేషన్లో రోడ్డు భద్రతపై ప్రత్యేక కార్యక్రమం
వట్పల్లి పోలీస్ స్టేషన్లో రోడ్డు భద్రతపై ప్రత్యేక కార్యక్రమం
Krishna
వట్పల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఎస్సై లవ కుమార్ ఆధ్వర్యంలో శనివారం రోడ్డు భద్రతపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు హాజరై చురుకుగా పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరాన్ని ఎస్సై వివరించారు. హెల్మెట్ ధరించడం, సీటుబెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, వేగ నియంత్రణ పాటించాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు. గ్రామ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించడంలో ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం పెంచితేనే ప్రమాదాలను తగ్గించగలమని తెలిపారు. కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగి, హాజరైన వారంతా ఈ అవగాహనను గ్రామాల్లోకి తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి