Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు నరాలు తెగే ఉత్కంఠ... ఢిల్లీ చేతిలో గెలుపు.. గుజరాత్ తన్నుకుపోయింది! “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 09, 2026 09:42 PM

వరి పంటలో అగ్గి తెగులు నివారణపై రైతులకు అవగాహన: ఏవో బి.శివశంకర్

వరి పంటలో అగ్గి తెగులు నివారణపై రైతులకు అవగాహన: ఏవో బి.శివశంకర్

వరి పంటలో అగ్గి తెగులు నివారణపై రైతులకు అవగాహన: ఏవో బి.శివశంకర్
March 09, 2026 05:44 PM 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని పలు గ్రామాల్లో వరి పంటలను వ్యవసాయ అధికారి (ఏవో) బి.శివశంకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి పండించే రైతులు పంటపై వచ్చే తెగుళ్లు, పురుగుల తీవ్రతను తరచూ పరిశీలిస్తూ పంట పొలాల పరిసర పరిస్థితులను విశ్లేషించుకోవాలని సూచించారు.

ప్రస్తుతం చాట్రాయి మండలంలో వరి పంట దుబ్బు చేసే దశలో ఉందని తెలిపారు. ఈ దశలో సరైన నీటి యాజమాన్య పద్ధతులు పాటిస్తూ పొలంలో సుమారు 5 సెంటీమీటర్ల నీటిమట్టం ఉండేలా చూసుకోవాలని రైతులకు సూచించారు.

ఉదయాన్నే మంచు ఎక్కువగా ఉండటం, పగటిపూట ఎండలు అధికంగా ఉండే పరిస్థితుల్లో వరి పంటకు అగ్గి తెగులు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ తెగులు సోకినప్పుడు వరి ఆకులపై వెన్ను మెడ భాగంలో దారపు కండెల ఆకారంలో మచ్చలు కనిపిస్తాయని, మచ్చల అంచుల్లో గోధుమ రంగు ఉండి మధ్యలో బూడిద రంగులో ఉంటాయని వివరించారు. అలాగే కణుపులు నల్లగా మారి కణుపు వద్ద మొక్క విరిగి పడిపోతుందని చెప్పారు.

తెగులు సోకిన పొలాల్లో శీలింద్ర మందులను పిచికారి చేయాలని సూచించారు. ట్రైసైక్లోజోల్ 75 శాతం మందును ఒక లీటర్ నీటికి 0.6 గ్రాములు లేదా ఇసోప్రోతిలిన్ 40 శాతం మందును ఒక లీటర్ నీటికి 1.5 మిల్లీలీటర్లు లేదా కాసుగామైసిన్ 3 శాతం మందును ఒక లీటర్ నీటికి 2.5 మిల్లీలీటర్లు కలిపి పిచికారి చేస్తే అగ్గి తెగులును నియంత్రించవచ్చని వ్యవసాయ అధికారి బి.శివశంకర్ రైతులకు సూచించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News