Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 06:36 AM

వరి పంటలో అగ్గి తెగులు నివారణపై రైతులకు అవగాహన: ఏవో బి.శివశంకర్

వరి పంటలో అగ్గి తెగులు నివారణపై రైతులకు అవగాహన: ఏవో బి.శివశంకర్

వరి పంటలో అగ్గి తెగులు నివారణపై రైతులకు అవగాహన: ఏవో బి.శివశంకర్
09-03-2026 79 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని పలు గ్రామాల్లో వరి పంటలను వ్యవసాయ అధికారి (ఏవో) బి.శివశంకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి పండించే రైతులు పంటపై వచ్చే తెగుళ్లు, పురుగుల తీవ్రతను తరచూ పరిశీలిస్తూ పంట పొలాల పరిసర పరిస్థితులను విశ్లేషించుకోవాలని సూచించారు.

ప్రస్తుతం చాట్రాయి మండలంలో వరి పంట దుబ్బు చేసే దశలో ఉందని తెలిపారు. ఈ దశలో సరైన నీటి యాజమాన్య పద్ధతులు పాటిస్తూ పొలంలో సుమారు 5 సెంటీమీటర్ల నీటిమట్టం ఉండేలా చూసుకోవాలని రైతులకు సూచించారు.

ఉదయాన్నే మంచు ఎక్కువగా ఉండటం, పగటిపూట ఎండలు అధికంగా ఉండే పరిస్థితుల్లో వరి పంటకు అగ్గి తెగులు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ తెగులు సోకినప్పుడు వరి ఆకులపై వెన్ను మెడ భాగంలో దారపు కండెల ఆకారంలో మచ్చలు కనిపిస్తాయని, మచ్చల అంచుల్లో గోధుమ రంగు ఉండి మధ్యలో బూడిద రంగులో ఉంటాయని వివరించారు. అలాగే కణుపులు నల్లగా మారి కణుపు వద్ద మొక్క విరిగి పడిపోతుందని చెప్పారు.

తెగులు సోకిన పొలాల్లో శీలింద్ర మందులను పిచికారి చేయాలని సూచించారు. ట్రైసైక్లోజోల్ 75 శాతం మందును ఒక లీటర్ నీటికి 0.6 గ్రాములు లేదా ఇసోప్రోతిలిన్ 40 శాతం మందును ఒక లీటర్ నీటికి 1.5 మిల్లీలీటర్లు లేదా కాసుగామైసిన్ 3 శాతం మందును ఒక లీటర్ నీటికి 2.5 మిల్లీలీటర్లు కలిపి పిచికారి చేస్తే అగ్గి తెగులును నియంత్రించవచ్చని వ్యవసాయ అధికారి బి.శివశంకర్ రైతులకు సూచించారు.

Sthanikam

వరి పంటలో అగ్గి తెగులు నివారణపై రైతులకు అవగాహన: ఏవో బి.శివశంకర్

Article Image

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని పలు గ్రామాల్లో వరి పంటలను వ్యవసాయ అధికారి (ఏవో) బి.శివశంకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి పండించే రైతులు పంటపై వచ్చే తెగుళ్లు, పురుగుల తీవ్రతను తరచూ పరిశీలిస్తూ పంట పొలాల పరిసర పరిస్థితులను విశ్లేషించుకోవాలని సూచించారు.

ప్రస్తుతం చాట్రాయి మండలంలో వరి పంట దుబ్బు చేసే దశలో ఉందని తెలిపారు. ఈ దశలో సరైన నీటి యాజమాన్య పద్ధతులు పాటిస్తూ పొలంలో సుమారు 5 సెంటీమీటర్ల నీటిమట్టం ఉండేలా చూసుకోవాలని రైతులకు సూచించారు.

ఉదయాన్నే మంచు ఎక్కువగా ఉండటం, పగటిపూట ఎండలు అధికంగా ఉండే పరిస్థితుల్లో వరి పంటకు అగ్గి తెగులు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ తెగులు సోకినప్పుడు వరి ఆకులపై వెన్ను మెడ భాగంలో దారపు కండెల ఆకారంలో మచ్చలు కనిపిస్తాయని, మచ్చల అంచుల్లో గోధుమ రంగు ఉండి మధ్యలో బూడిద రంగులో ఉంటాయని వివరించారు. అలాగే కణుపులు నల్లగా మారి కణుపు వద్ద మొక్క విరిగి పడిపోతుందని చెప్పారు.

తెగులు సోకిన పొలాల్లో శీలింద్ర మందులను పిచికారి చేయాలని సూచించారు. ట్రైసైక్లోజోల్ 75 శాతం మందును ఒక లీటర్ నీటికి 0.6 గ్రాములు లేదా ఇసోప్రోతిలిన్ 40 శాతం మందును ఒక లీటర్ నీటికి 1.5 మిల్లీలీటర్లు లేదా కాసుగామైసిన్ 3 శాతం మందును ఒక లీటర్ నీటికి 2.5 మిల్లీలీటర్లు కలిపి పిచికారి చేస్తే అగ్గి తెగులును నియంత్రించవచ్చని వ్యవసాయ అధికారి బి.శివశంకర్ రైతులకు సూచించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News