వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన:ఖేఢ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్
వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన:ఖేఢ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్
Krishna
నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా ఏర్పడిన సమస్యలను పరిశీలించేందుకు మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్,మున్సిపల్ కమిషనర్ ప్రశాంతితో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించారు. వర్షాల ప్రభావంతో డ్రైనేజీలు నిండిపోవడం, రోడ్లపై నీరు నిల్వ ఉండడం, కాలనీల్లో నీటి సమస్యలు తలెత్తడం, గాలి దుమారం కారణంగా విద్యుత్ అంతరాయం ఏర్పడడం వంటి సమస్యలను అధికారులతో కలిసి పరిశీలించి వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ సిబ్బంది అప్రమత్తంగా పనిచేయాలని సూచించిన ఆయన, నిల్వ ఉన్న వర్షపు నీటిని త్వరితగతిన తొలగించి పారిశుద్ధ్య చర్యలను మరింత బలోపేతం చేయాలని తెలిపారు. వర్షాకాలంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో మున్సిపల్ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తాహిర్ అలీ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి