Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 09:22 AM

వరలక్ష్మి పారాబాయిల్డ్ రైస్ మిల్లు యాజమాన్యంపై కేసు నమోదు

వరలక్ష్మి పారాబాయిల్డ్ రైస్ మిల్లు యాజమాన్యంపై కేసు నమోదు

వరలక్ష్మి పారాబాయిల్డ్  రైస్ మిల్లు యాజమాన్యంపై కేసు నమోదు
February 24, 2026 07:48 AM 4 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Chityala
Komidala Mahender reddy

ప్రభుత్వానికి తిరిగి చెల్లించాల్సిన ధాన్యాన్ని సరఫరా చేయకపోవడంతో చిట్యాలలోని వర లక్ష్మీ పారాబాయిల్డ్ రైస్ మిల్లు యాజమాన్యంపై చిట్యాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. పోలీసులు, సివిల్ సప్లయ్ అధికారులు తెలిపిన వివ రాల ప్రకారం.. చిట్యాలలోని వరలక్షీ పారాబాయిల్డ్ రైస్ మిల్లు యాజమాన్యం 2022-23 యాసంగి సీజన్లో తీసుకున్న ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ చేసి తిరిగి ప్రభుత్వానికిఅప్పగించలేదు. 59,538 క్విం టాళ్ల ధాన్యం ప్రభుత్వానికి తిరిగి అప్పగించాల్సి ఉం ది. సివిల్ సప్లయ్ అధికారులు చేసిన విచారణలో ఆ మిల్లులో ధాన్యం లేనట్లుగా తెలింది. సుమారు రూ.14,53,80,112 ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉం ది. ఈ డబ్బులను రైస్ మిల్లర్ నిర్ణీత గడుపులో చెల్లించకపోవడంతో అపరాధ రుసుముగా మరో రూ.3,63,46778 చెల్లించాల్సి వచ్చింది. ఈ బకాయి లను చెల్లించాలని రైస్ మిల్లర్కు సివిల్ సప్లయ్చిట్యాలలో కస్టమ్ మిల్లింగ్ ధాన్యం చెల్లించని వరలక్ష్మీ పారాబాయిల్డ్ రైస్ మిల్లుఅధికారులు నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. దీంతో చిట్యాల పోలీసే స్టేషన్లో డీఎం ఫిర్యాదు చేయగా.. వరలక్ష్మీ రైస్ మిల్లు యాజమాన్యంపై ఆదివారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News