వరల్డ్ టీబీ డే సందర్భంగా అవగాహన ర్యాలీ. క్షయ వ్యాధిపై అప్రమత్తతే రక్షణ
వరల్డ్ టీబీ డే సందర్భంగా అవగాహన ర్యాలీ. క్షయ వ్యాధిపై అప్రమత్తతే రక్షణ
Editor Desk
విద్యార్థులతో అవగాహన కార్యక్రమం, ర్యాలీ
రామన్నపేటలోని బాయ్స్ హై స్కూల్లో వరల్డ్ టీబీ డే సందర్భంగా మండల వైద్యాధికారి డాక్టర్ అశ్విని కుమార్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా హెచ్ఈఓ గోపాల్ మాట్లాడుతూ జాతీయ క్షయ రోగ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా క్షయ వ్యాధి మైకోబాక్టీరియమ్ ట్యూబర్క్యులోసిస్ అనే బాక్టీరియా వల్ల వస్తుందని తెలిపారు. తుమ్మడం, దగ్గడం, మాట్లాడడం ద్వారా తుంపరల ద్వారా ఒకరి నుండి మరొకరికి వ్యాపించే వ్యాధి అని వివరించారు.
క్షయ వ్యాధి లక్షణాలు, గుర్తించే విధానం, పూర్తి చికిత్స అవసరం, పోషకాహారం, వ్యక్తిగత శుభ్రత, మాస్కులు ధరించడం వంటి జాగ్రత్తలను విద్యార్థులకు తెలియజేశారు. క్షయ రోగుల పట్ల ఆధరాభిమానాలు చూపించి, వారు పూర్తిస్థాయి చికిత్స తీసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు.
అనంతరం విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం మంజుల, హెడ్మాస్టర్ ఎం. శేషాచారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి