Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 02:40 PM

వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను

వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను

వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను
February 25, 2026 03:03 PM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మంచినీటి ఎద్దడిలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా

మంచినీటి ఎద్దడి నేపథ్యంలో 14వ వార్డు ప్రజలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని వార్డు కౌన్సిలర్ గాలి సాయికిరణ్ తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారంలో తాను ఎల్లప్పుడూ ముందుంటానని, వార్డు అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. గత రెండు రోజులుగా కొన్ని సాంకేతిక కారణాలతో పురపాలక సంఘం ద్వారా మంచినీటి సరఫరా నిలిచిపోయిన నేపథ్యంలో వార్డు ప్రజల అభ్యర్థన మేరకు అవసరమైన ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందిస్తున్నామని వివరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి అత్యధిక మెజార్టీతో గెలిపించిన 14వ వార్డు ప్రజలకు తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కరించేందుకు సిద్ధంగా ఉంటానని స్పష్టం చేశారు. అలాగే భారత రాష్ట్ర సమితి నాయకుడు గుండపనేని కిరణ్ మాట్లాడుతూ, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో ఎలాంటి లోపం ఉండనీయబోమన్నారు. వార్డు ప్రజల సహకారంతో సమస్యలను అధిగమిస్తామని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News