వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను
వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను
Biksham Goud
మంచినీటి ఎద్దడిలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా
మంచినీటి ఎద్దడి నేపథ్యంలో 14వ వార్డు ప్రజలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని వార్డు కౌన్సిలర్ గాలి సాయికిరణ్ తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారంలో తాను ఎల్లప్పుడూ ముందుంటానని, వార్డు అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. గత రెండు రోజులుగా కొన్ని సాంకేతిక కారణాలతో పురపాలక సంఘం ద్వారా మంచినీటి సరఫరా నిలిచిపోయిన నేపథ్యంలో వార్డు ప్రజల అభ్యర్థన మేరకు అవసరమైన ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందిస్తున్నామని వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి అత్యధిక మెజార్టీతో గెలిపించిన 14వ వార్డు ప్రజలకు తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కరించేందుకు సిద్ధంగా ఉంటానని స్పష్టం చేశారు. అలాగే భారత రాష్ట్ర సమితి నాయకుడు గుండపనేని కిరణ్ మాట్లాడుతూ, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో ఎలాంటి లోపం ఉండనీయబోమన్నారు. వార్డు ప్రజల సహకారంతో సమస్యలను అధిగమిస్తామని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి