Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాళేశ్వరం పై కక్షసాధింపుకు బ్రేక్ – హైకోర్టు స్టేతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 03:27 AM

వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను

వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను

వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను
February 25, 2026 03:03 PM 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మంచినీటి ఎద్దడిలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా

మంచినీటి ఎద్దడి నేపథ్యంలో 14వ వార్డు ప్రజలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని వార్డు కౌన్సిలర్ గాలి సాయికిరణ్ తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారంలో తాను ఎల్లప్పుడూ ముందుంటానని, వార్డు అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. గత రెండు రోజులుగా కొన్ని సాంకేతిక కారణాలతో పురపాలక సంఘం ద్వారా మంచినీటి సరఫరా నిలిచిపోయిన నేపథ్యంలో వార్డు ప్రజల అభ్యర్థన మేరకు అవసరమైన ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందిస్తున్నామని వివరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి అత్యధిక మెజార్టీతో గెలిపించిన 14వ వార్డు ప్రజలకు తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కరించేందుకు సిద్ధంగా ఉంటానని స్పష్టం చేశారు. అలాగే భారత రాష్ట్ర సమితి నాయకుడు గుండపనేని కిరణ్ మాట్లాడుతూ, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో ఎలాంటి లోపం ఉండనీయబోమన్నారు. వార్డు ప్రజల సహకారంతో సమస్యలను అధిగమిస్తామని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News