Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 17, 2026 07:13 AM

వలిగొండ నర్సరీలో మొక్కల పెంపకంపై ఎంపీడీఓ జలందర్ రెడ్డి సమీక్ష

వలిగొండ నర్సరీలో మొక్కల పెంపకంపై ఎంపీడీఓ జలందర్ రెడ్డి సమీక్ష

వలిగొండ నర్సరీలో మొక్కల పెంపకంపై ఎంపీడీఓ జలందర్ రెడ్డి సమీక్ష
March 17, 2026 05:39 AM 10 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

వలిగొండ గ్రామంలోని నర్సరీని సోమవారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) జి. జలందర్ రెడ్డి సందర్శించి అక్కడ జరుగుతున్న మొక్కల పెంపకం పనులను పరిశీలించారు. నర్సరీలో పెంచుతున్న మొక్కల పరిస్థితిని అడిగి తెలుసుకొని సిబ్బందితో మాట్లాడారు. ముఖ్యంగా వేప, రేగి మొక్కల పెంపకం వివరాలను తెలుసుకున్నారు. గ్రామంలో చేపట్టనున్న వృక్షారోపణ కార్యక్రమాలకు అవసరమైన మొక్కలను సమయానికి సిద్ధం చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.

వేసవి కాలం ఇప్పటికే ప్రారంభమైందని, రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున నర్సరీలో ఉన్న మొక్కలకు తగిన నీరు అందిస్తూ ప్రత్యేక శ్రద్ధతో సంరక్షణ చేయాలని ఎంపీడీఓ తెలిపారు. మొక్కలు ఎండకు ఎండిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, నర్సరీ నిర్వహణను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సిబ్బందికి ఆదేశించారు.

అధికారుల పర్యవేక్షణతో నర్సరీలో మొక్కల పెంపకం పనులు మరింత సమర్థవంతంగా సాగాలని ఆయన ఆకాంక్షించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News