వజ్ర హోమ్స్లో వారికి ఎలాంటి భూమి లేదు
వజ్ర హోమ్స్లో వారికి ఎలాంటి భూమి లేదు
Biksham
అక్రమంగా స్థలాలు ఆక్రమించుకునే ప్రయత్నాలు – కఠిన చర్యలు తీసుకోవాలి
జిల్లా కేంద్రంలోని 29వ వార్డులో ఉన్న వజ్ర హోమ్స్లో కొందరు తప్పుడు పత్రాలతో అక్రమంగా స్థలాలు ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ ఆరోపించారు. ఆదివారం వజ్ర హోమ్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.2015 నుంచి 2018 వరకు అన్ని అనుమతులతో సక్రమంగా నమోదులు పూర్తి చేసుకొని ఇళ్లను నిర్మించి నివాసం ఉంటున్నామని తెలిపారు. అయితే నల్ల ఉమా జ్యోతి రెడ్డి తప్పుడు పత్రాలు సృష్టించి తన భర్త నల్ల చిత్తరంజన్ రెడ్డి పేరుతో 9000 గజాల భూమి ఉన్నట్లు చూపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
ఈ వ్యవహారంలో గతంలో ఒప్పందం ప్రకారం సమస్యలు పరిష్కరించి నమోదు చేస్తామని చెప్పి తన వద్ద నుంచి డబ్బులు తీసుకొని, అనంతరం తప్పుడు పత్రాలతో ఇతరులతో ఒప్పందాలు చేసుకున్నారని తెలిపారు. ఈ విషయంపై సూర్యాపేట గ్రామీణ పోలీసు కేంద్రంలో కేసులు నమోదయ్యాయని చెప్పారు.అలాగే తప్పుడు పత్రాలు రద్దు చేస్తామని చెప్పి డబ్బులు తీసుకొని విదేశాలకు వెళ్లిపోయారని, ప్రస్తుతం తిరిగి వచ్చి అధికార పార్టీ నాయకుల అండతో భూములు లేకపోయినా ఇతరులకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.వజ్ర హోమ్స్ నిర్వహణ వర్గం కూడా ఈ విషయంపై న్యాయ సలహా మేరకు నల్ల ఉమా జ్యోతి రెడ్డి, నల్ల చిత్తరంజన్ రెడ్డి ద్వారా ఎలాంటి కొనుగోలు విక్రయాలు చేయవద్దని బహిరంగ ప్రకటన విడుదల చేసినట్లు తెలిపారు. ఈ విషయాన్ని సూర్యాపేట ఉపనమోదు కార్యాలయం నోటీసుల ద్వారా కూడా తెలియజేసినట్లు చెప్పారు.
ఇప్పటికీ పలుమార్లు మోసాలకు పాల్పడిన వారిపై పూర్తిస్థాయి విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి