Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 12:27 PM

వైద్యులు రోగులకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలి

వైద్యులు రోగులకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలి

వైద్యులు రోగులకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలి
April 23, 2026 04:43 PM 60 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఆసుపత్రుల్లో వైద్యులు రోగులకు సమయానికి అందుబాటులో ఉండాలని, లేకపోతే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హెచ్చరించారు.

గురువారం హుజూర్‌నగర్ ఏరియా ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో కొందరు డాక్టర్లు అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి సమయం పూర్తికాకముందే డ్యూటీ నుంచి వెళ్లిపోయిన ఘటనలపై వివరాలు కోరారు.

అనంతరం డయాలసిస్ కేంద్రం, బ్లడ్ బ్యాంక్, అత్యవసర విభాగం, ఓపీ విభాగాలను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఓపీ విభాగంలో సమయపాలన పాటించని డాక్టర్లు, కాంట్రాక్ట్ వైద్యులపై చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. దీనిపై పూర్తి నివేదిక సమర్పించాలని తెలిపారు.

ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని, గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. సాధారణ ప్రసవాలు పెరిగేలా అవగాహన కల్పించాలని అన్నారు.

ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, పారిశుధ్య నిర్వహణపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, శానిటేషన్ సిబ్బంది, నర్సింగ్ అధికారులను అభినందించారు. కాయకల్ప అవార్డు సాధించేలా కృషి చేయాలని కోరారు.

ఆసుపత్రిలో నిర్మాణంలో ఉన్న నూతన ఓపీ బ్లాక్ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. సిటీ స్కాన్ యంత్రం పనితీరును పరిశీలించారు. టి-హబ్ నిర్వహణలో ఉన్న లోపాలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు, సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్ కుమార్, ఆర్ఎంఓ డాక్టర్ రవి కుమార్, గైనకాలజిస్ట్ డాక్టర్ వనజ, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News