Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 02:43 PM

వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
March 09, 2026 07:01 PM 72 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత

ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆరవ వార్డు సభ్యుడు చిలుముల సునీల్ రెడ్డి, గిరి నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు బి. ప్రణీత్ నాయక్ తెలిపారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గిరి నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. వార్డు ప్రజలు అవసరమైన వారు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకొని చికిత్స పొందాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారుల ఆదేశాల మేరకు ఈ వైద్య శిబిరం నిర్వహించినట్లు తెలిపారు. ఈ శిబిరంలో సూర్యాపేట సాధారణ ఆసుపత్రికి చెందిన వైద్యులు ఎముకల వ్యాధులు, సాధారణ వైద్యం, కంటి పరీక్షలు, మహిళల వైద్యం, చిన్నపిల్లల వైద్యం వంటి విభాగాలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు.

శిబిరానికి వచ్చిన రోగులకు రక్తపోటు, చక్కెర స్థాయిలు వంటి అవసరమైన పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను

అందజేశారు. ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు వెంకటేష్, సమీరా, శ్రీకాంత్ వర్మ, పర్యవేక్షకులు రమణ, ఏకస్వామి, నర్సింగ్ అధికారి భాగ్యలక్ష్మి, మందుల విభాగం అధికారి మధు, ప్రయోగశాల సిబ్బంది భార్గవి, ఆరోగ్య కార్యకర్తలు విజయ, సువర్ణ, చిలుకమ్మ, కరుణ, సుశీల, కవిత, శాంత, ఆశ కార్యకర్తలు బైనాభి, ఫర్విన్, శైలజ, ఉమా, రజిత, సావిత్రి, సునీత, పారిజాతం, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News