Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హరీష్ రావును కలిసిన ఉద్యమ నేత ఎస్.కె. చాంద్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు దిశగా కీలక ముందడుగు కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్పొరేట్ స్థాయికి ప్రభుత్వ పాఠశాలలు – ప్రతిభావంతుల సత్కారం డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 07, 2026 11:26 PM

వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
March 09, 2026 07:01 PM 68 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత

ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆరవ వార్డు సభ్యుడు చిలుముల సునీల్ రెడ్డి, గిరి నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు బి. ప్రణీత్ నాయక్ తెలిపారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గిరి నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. వార్డు ప్రజలు అవసరమైన వారు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకొని చికిత్స పొందాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారుల ఆదేశాల మేరకు ఈ వైద్య శిబిరం నిర్వహించినట్లు తెలిపారు. ఈ శిబిరంలో సూర్యాపేట సాధారణ ఆసుపత్రికి చెందిన వైద్యులు ఎముకల వ్యాధులు, సాధారణ వైద్యం, కంటి పరీక్షలు, మహిళల వైద్యం, చిన్నపిల్లల వైద్యం వంటి విభాగాలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు.

శిబిరానికి వచ్చిన రోగులకు రక్తపోటు, చక్కెర స్థాయిలు వంటి అవసరమైన పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను

అందజేశారు. ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు వెంకటేష్, సమీరా, శ్రీకాంత్ వర్మ, పర్యవేక్షకులు రమణ, ఏకస్వామి, నర్సింగ్ అధికారి భాగ్యలక్ష్మి, మందుల విభాగం అధికారి మధు, ప్రయోగశాల సిబ్బంది భార్గవి, ఆరోగ్య కార్యకర్తలు విజయ, సువర్ణ, చిలుకమ్మ, కరుణ, సుశీల, కవిత, శాంత, ఆశ కార్యకర్తలు బైనాభి, ఫర్విన్, శైలజ, ఉమా, రజిత, సావిత్రి, సునీత, పారిజాతం, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News