వైభవంగా స్వయంభు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు – పులిమామిడి రాజు
వైభవంగా స్వయంభు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు – పులిమామిడి రాజు
Krishna
సంగారెడ్డి జిల్లా సదాశివపేట సమీపంలోని వెంకటాపూర్ గ్రామంలో స్వయంభువుగా వెలసిన శ్రీ పద్మావతి సమేత అద్భుత వెంకటేశ్వర స్వామి చతుర్థ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పులిమామిడి రాజును ఆలయ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు పూలమాలలు వేసి శాలువాతో సత్కరించి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. మే 5 నుండి 8 వరకు బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు తెలిపారు. మే 7 గురువారం ఉదయం 11 గంటలకు శ్రీవారి కళ్యాణోత్సవం, సాయంత్రం 4 గంటలకు సదాశివపేట పట్టణం నుండి వెంకటాపూర్ ఆలయం వరకు స్వామివారి దివ్య విమాన రథోత్సవం ఘనంగా నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆలయ అధ్యక్షులు చిల్వేరి వెంకటేశం కోరారు. ఈ సందర్భంగా పులిమామిడి రాజు మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని, బ్రహ్మోత్సవాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పండల జగదీశ్వర్ పంతులు, షోలాపురం రాజు, తాటికొండ నాగనాథ్, సుధాకర్, మల్లారెడ్డి, భాస్కర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి