షాంపూర్ సమీపంలో ఉదయం ప్రమాదం.. పలువురికి గాయాలు
సోమవారం ఉదయం ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. మండలంలోని షాంపూర్ సమీపంలో ప్రయాణిస్తున్న బస్సు అకస్మాత్తుగా అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న వాగులోకి దూసుకెళ్లింది. ఘటనతో బస్సులో ఉన్న పలువురు ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం.
ప్రమాదం జరుగుతుండగానే స్థానికులు అప్రమత్తమై వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీసి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం అత్యవసర సేవల కోసం 108 అంబులెన్స్కు సమాచారం అందించడంతో గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు.
ప్రమాద సమయంలో బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు? గాయాల తీవ్రత ఎంత? అనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యమా, వాహనంలో సాంకేతిక లోపమా అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి