Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడే మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష కదం తొక్కిన గిల్.. కోల్‌కతాపై గుజరాత్‌ ఘన విజయం రైతు కుటుంబానికి అండగా రెడ్స్ సంస్థ ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 18, 2026 08:07 PM

వాగ్దానాలు అమలు చేయాలి – వ్యవసాయ కార్మిక సంఘం

వాగ్దానాలు అమలు చేయాలి – వ్యవసాయ కార్మిక సంఘం

వాగ్దానాలు అమలు చేయాలి – వ్యవసాయ కార్మిక సంఘం
April 18, 2026 06:24 PM 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఏప్రిల్ 20, 21న ఎమ్మార్వో కార్యాలయాల వద్ద ధర్నాలకు పిలుపు

ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.

కూసుమంచి మండల కేంద్రంలో నిర్వహించిన వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు. వి బి జి రాంజీ బిల్లును రద్దు చేయాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ 20, 21 తేదీలలో ఎమ్మార్వో కార్యాలయాల వద్ద నిర్వహించే ధర్నాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News