వాగ్దానాలు అమలు చేయాలి – వ్యవసాయ కార్మిక సంఘం
వాగ్దానాలు అమలు చేయాలి – వ్యవసాయ కార్మిక సంఘం
Biksham
ఏప్రిల్ 20, 21న ఎమ్మార్వో కార్యాలయాల వద్ద ధర్నాలకు పిలుపు
ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
కూసుమంచి మండల కేంద్రంలో నిర్వహించిన వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు. వి బి జి రాంజీ బిల్లును రద్దు చేయాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ 20, 21 తేదీలలో ఎమ్మార్వో కార్యాలయాల వద్ద నిర్వహించే ధర్నాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి