వెనుజులాపై అమెరికా దుర్మార్గ దాడులు తక్షణమే నిలిపివేయాలి
వెనుజులాపై అమెరికా దుర్మార్గ దాడులు తక్షణమే నిలిపివేయాలి
Biksham
ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తున్న అమెరికా సామ్రాజ్యవాద యుద్ధోన్మాదం – వరికుప్పల వెంకన్న
సూర్యపేట స్థానికం ప్రతినిధి బిక్షం
వెనుజులా దేశంపై అమెరికా చేపడుతున్న దుర్మార్గమైన, నేరపూరిత సైనిక దాడులను మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (ఐక్య) సూర్యాపేట జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తోందని పార్టీ జాతీయ కమిటీ సభ్యులు వరికుప్పల వెంకన్న, జిల్లా కార్యదర్శి షేక్ నజీర్ ఒక ప్రకటనలో తెలిపారు.
వెనుజులా దేశంలోని కారకాస్ నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లోని పౌర, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా జరుపుతున్న సైనిక దాడులు అత్యంత అమానుషమని వారు పేర్కొన్నారు. ఇవి అన్ని రకాల అంతర్జాతీయ చట్టాలు, మానవ హక్కుల సూత్రాలను ఉల్లంఘించడమేనని అన్నారు.
అమెరికా ఐక్యరాజ్యసమితి నియమావళి, భద్రతామండలి నిబంధనలను తుంగలో తొక్కుతూ ఏకపక్ష దాడులకు దిగడం ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలను పూర్తిగా ధిక్కరిస్తోందని విమర్శించారు. గత కొన్ని నెలలుగా వెనుజులా సరిహద్దు ప్రాంతాల్లో అమెరికా తన సైనిక, నౌకాదళ బలగాలను మోహరించడం ప్రపంచ దేశాల అభిశంసనకు గురవుతున్నప్పటికీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రపంచ శాంతి, సౌభ్రాతృత్వానికి తీవ్ర ముప్పుగా మారిందని తెలిపారు.
స్వయం ప్రతిపత్తి, స్వయం పోషక విధానాలతో ముందుకు సాగుతున్న దేశాలపై ఆర్థిక, సైనిక దాడులు చేయడం ద్వారా వాటి ఆర్థిక వ్యవస్థలను కుదేల్ చేయాలనే అమెరికా సామ్రాజ్యవాద విధానాలు అత్యంత దుర్మార్గమైనవని పేర్కొన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాంతికాముకులు, ప్రజాస్వామ్యవాదులు స్పందించాలని పిలుపునిచ్చారు.
అమెరికా యుద్ధోన్మాద దుష్ట చర్యలను భారత ప్రభుత్వం గట్టిగా ఖండించి, వ్యతిరేకించాలని యంసిపిఐ (యు) పార్టీ డిమాండ్ చేస్తోందని ఈ ప్రకటనలో వరికుప్పల వెంకన్న, షేక్ నజీర్ తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి