వదిలి వేయబడ్డ పిల్లల సంరక్షణ కు ప్రభుత్వ "ఉయ్యాల" ఏర్పాటు
వదిలి వేయబడ్డ పిల్లల సంరక్షణ కు ప్రభుత్వ "ఉయ్యాల" ఏర్పాటు
Harish HS
వదిలి వేయబడ్డ పిల్లల సంరక్షణ కు ప్రభుత్వ "ఉయ్యాల" ఏర్పాటు
జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్
కోదాడ మండల పరిధిలో జరిగిన అమానవీయ సంఘటన జరిగింది. ఒక రోజు గల పాపను చెట్ల పొదలలో వదిలివేయడం జరిగినది. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ చాలా కలత చెందారు. ఈ సంఘటనను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎవరైనా అనాధ బాలలను ముళ్ల పొదలలో, చెత్త కుండీలలో వదిలివేయడం లాంటివి చేయకూడదని, అలా చేసినట్లయితే ఆ పిల్లలు చనిపోయే ఆవకాశం వున్నదని అన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో, పిల్లలను పోషించలేని పరిస్థితి ఉన్నట్లయితే అట్టి పిల్లల్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసినటువంటి ఉయ్యాల నందు, అంగన్వాడీ టీచర్, ఏఎన్ఎంలకు గాని అప్పగించవలసిందిగా తెలిపినారు.వదిలి వేయబడ్డ పిల్లలను సంరక్షించడం కోసం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని ప్రసూతి వైద్యశాలలు, జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఉయ్యాల ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ అన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి