Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ బడిలో చదివే విద్యార్థుల బాధ్యత మాది యోగ కార్యక్రమంలో పాల్గొన్న సత్యసాయి జిల్లా అధికారులు సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 05:35 PM

వడ్డెర కులస్తుల ఆధ్వర్యంలో ఓబన్న జయంతి వేడుకలు

వడ్డెర కులస్తుల ఆధ్వర్యంలో ఓబన్న జయంతి వేడుకలు

వడ్డెర కులస్తుల ఆధ్వర్యంలో ఓబన్న జయంతి వేడుకలు
January 12, 2026 04:53 AM 337 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిట్యాల స్థానికం ప్రతినిధి ప్రశాంత్

చిన్నకాపర్తి వడ్డె ఓబన్న 219వ జయంతి వేడుకలు

చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో వ్యతిరేకంగా పోరాటం సాగించిన రేనాటి సమరయోధుడు వడ్డె ఓబన్న 219వ జయంతిని గ్రామ వడ్డెర కులస్తుల ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్డె ఓబన్న విగ్రహానికి పూలమాలలు వేసి, కేకు కట్ చేసి ఆయన చేసిన త్యాగాలు, వీరత్వాన్ని స్మరించుకున్నారు.వడ్డెర కులస్తులు మాట్లాడుతూ వడ్డె ఓబన్న అణచివేతకు వ్యతిరేకంగా పోరాడి ప్రజల హక్కుల కోసం నిలబడ్డ వీరుడని, ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సమాజంలో ఐక్యత, ధైర్యం, త్యాగభావన పెంపొందించేందుకు ఇటువంటి జయంతి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో వడ్డెర కులస్తులైన దుర్గయ్య, బిక్షం, వెంకన్న, లింగయ్య, ఇద్దయ్య, ప్రశాంత్, కిషోర్, గణేష్, రాజు, మహేష్, నర్సింహ, యాదయ్య, ఎల్లయ్య, కిష్టయ్య, లింగస్వామి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News