వడ్డెర కులస్తుల ఆధ్వర్యంలో ఓబన్న జయంతి వేడుకలు
వడ్డెర కులస్తుల ఆధ్వర్యంలో ఓబన్న జయంతి వేడుకలు
Editor Desk
చిట్యాల స్థానికం ప్రతినిధి ప్రశాంత్
చిన్నకాపర్తి వడ్డె ఓబన్న 219వ జయంతి వేడుకలు
చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో వ్యతిరేకంగా పోరాటం సాగించిన రేనాటి సమరయోధుడు వడ్డె ఓబన్న 219వ జయంతిని గ్రామ వడ్డెర కులస్తుల ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్డె ఓబన్న విగ్రహానికి పూలమాలలు వేసి, కేకు కట్ చేసి ఆయన చేసిన త్యాగాలు, వీరత్వాన్ని స్మరించుకున్నారు.వడ్డెర కులస్తులు మాట్లాడుతూ వడ్డె ఓబన్న అణచివేతకు వ్యతిరేకంగా పోరాడి ప్రజల హక్కుల కోసం నిలబడ్డ వీరుడని, ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సమాజంలో ఐక్యత, ధైర్యం, త్యాగభావన పెంపొందించేందుకు ఇటువంటి జయంతి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో వడ్డెర కులస్తులైన దుర్గయ్య, బిక్షం, వెంకన్న, లింగయ్య, ఇద్దయ్య, ప్రశాంత్, కిషోర్, గణేష్, రాజు, మహేష్, నర్సింహ, యాదయ్య, ఎల్లయ్య, కిష్టయ్య, లింగస్వామి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి