వడ్డెర సంఘం అధ్యక్షుడిగా బోధాస్ సత్యనారాయణ
వడ్డెర సంఘం అధ్యక్షుడిగా బోధాస్ సత్యనారాయణ
స్థానికం బృందం
ఇంద్రపాలనగరం: వడ్డెర సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన బోధాస్ సత్యనారాయణ (తండ్రి బిక్షపతి)ను గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంఘ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన ఆకాంక్షిస్తూ, తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని తెలిపారు.
నూతన కమిటీలో గౌరవ అధ్యక్షులుగా భోదాస్ లక్ష్మీనారాయణ, భోదాస్ పెద్ద ఎల్లయ్య, వరికుప్పల మల్లేష్ ఎంపికయ్యారు. ఉపాధ్యక్షులుగా దండుగుల శ్రీనివాస్, వరికుప్పల నగేష్, ప్రధాన కార్యదర్శిగా పల్లపు అశోక్ బాధ్యతలు స్వీకరించారు. కోశాధికారిగా వరికుప్పల స్వామి, ప్రచార కార్యదర్శులుగా భోదాస్ వెంకటేష్, వరికుప్పల రాజమల్లు నియమితులయ్యారు.
కార్యవర్గ సభ్యులుగా పల్లపు శ్రీనివాస్, కుంచం శ్రీను, పల్లపు మల్లేష్, భోదాస్ మహేష్, భోదాస్ చిన్న నర్సింహా, వరికుప్పల బాబు ఎంపికయ్యారు. నూతన కమిటీ సభ్యులను సన్మానించి, వడ్డెర సంఘ సంక్షేమం కోసం కృషి చేయాలని తీర్మానం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి