వడ్డీ వ్యాపారుల వేధింపులకు బలైన ప్రభుత్వ ఉద్యోగి
వడ్డీ వ్యాపారుల వేధింపులకు బలైన ప్రభుత్వ ఉద్యోగి
Komidala Mahender reddy
చిట్ఫండ్ ఏజెంట్లు, అధిక వడ్డీల ఒత్తిడితో ఏఈఓ ఆత్మహత్య.. ఉరుమడ్లలో విషాదం.
ఉరుమడ్ల గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వడ్డీ వ్యాపారులు, చిట్ఫండ్ ఏజెంట్ల వేధింపులు తట్టుకోలేక వ్యవసాయ శాఖలో అసిస్టెంట్ అగ్రికల్చరల్ ఆఫీసర్ (ఏఈఓ)గా పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి గుంటోజు బాలరాజు (38) ఆత్మహత్యకు పాల్పడ్డారు.
చిట్యాల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాలరాజు ప్రస్తుతం కేతపల్లి మండలంలో ఏఈఓగా విధులు నిర్వహిస్తున్నారు. కొంతకాలం క్రితం వ్యక్తిగత అవసరాల కోసం కొందరు ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పులు తీసుకున్నాడు. అయితే, అప్పు ఇచ్చిన వారు అధిక వడ్డీలు వేస్తూ, ఖాళీ చెక్కులు మరియు ప్రామిసరీ నోట్లపై ముందుగానే సంతకాలు తీసుకున్నట్లు సమాచారం.గత కొంతకాలంగా డబ్బుల కోసం వడ్డీ వ్యాపారులు, చిట్ఫండ్ ఏజెంట్లు తీవ్ర ఒత్తిడి తీసుకువస్తూ బాలరాజును మానసికంగా వేధిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ వేధింపులు భరించలేక బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తీవ్ర మనస్తాపానికి గురైన బాలరాజు తన నివాసంలో సీలింగ్ ఫ్యాన్కు చీరతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.మృతుడికి భార్య పద్మ, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. మృతుని భార్య గుంటోజు పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిట్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి