Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెన్షన్ కోసం వెళ్లి ప్రాణాలతో పోరాటం..! నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 13, 2026 09:30 AM

వడ్డీ వ్యాపారుల వేధింపులకు బలైన ప్రభుత్వ ఉద్యోగి

వడ్డీ వ్యాపారుల వేధింపులకు బలైన ప్రభుత్వ ఉద్యోగి

వడ్డీ వ్యాపారుల వేధింపులకు బలైన ప్రభుత్వ ఉద్యోగి
May 28, 2026 09:48 PM 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్‌ఫండ్ ఏజెంట్లు, అధిక వడ్డీల ఒత్తిడితో ఏఈఓ ఆత్మహత్య.. ఉరుమడ్లలో విషాదం.

ఉరుమడ్ల గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వడ్డీ వ్యాపారులు, చిట్‌ఫండ్ ఏజెంట్ల వేధింపులు తట్టుకోలేక వ్యవసాయ శాఖలో అసిస్టెంట్ అగ్రికల్చరల్ ఆఫీసర్ (ఏఈఓ)గా పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి గుంటోజు బాలరాజు (38) ఆత్మహత్యకు పాల్పడ్డారు.

చిట్యాల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాలరాజు ప్రస్తుతం కేతపల్లి మండలంలో ఏఈఓగా విధులు నిర్వహిస్తున్నారు. కొంతకాలం క్రితం వ్యక్తిగత అవసరాల కోసం కొందరు ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పులు తీసుకున్నాడు. అయితే, అప్పు ఇచ్చిన వారు అధిక వడ్డీలు వేస్తూ, ఖాళీ చెక్కులు మరియు ప్రామిసరీ నోట్లపై ముందుగానే సంతకాలు తీసుకున్నట్లు సమాచారం.గత కొంతకాలంగా డబ్బుల కోసం వడ్డీ వ్యాపారులు, చిట్‌ఫండ్ ఏజెంట్లు తీవ్ర ఒత్తిడి తీసుకువస్తూ బాలరాజును మానసికంగా వేధిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ వేధింపులు భరించలేక బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తీవ్ర మనస్తాపానికి గురైన బాలరాజు తన నివాసంలో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.మృతుడికి భార్య పద్మ, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. మృతుని భార్య గుంటోజు పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిట్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News