Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వడ్డీ వ్యాపారుల వేధింపులకు బలైన ప్రభుత్వ ఉద్యోగి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 28, 2026 10:57 PM

వడ్డీ వ్యాపారుల వేధింపులకు బలైన ప్రభుత్వ ఉద్యోగి

వడ్డీ వ్యాపారుల వేధింపులకు బలైన ప్రభుత్వ ఉద్యోగి

వడ్డీ వ్యాపారుల వేధింపులకు బలైన ప్రభుత్వ ఉద్యోగి
May 28, 2026 09:48 PM 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్‌ఫండ్ ఏజెంట్లు, అధిక వడ్డీల ఒత్తిడితో ఏఈఓ ఆత్మహత్య.. ఉరుమడ్లలో విషాదం.

ఉరుమడ్ల గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వడ్డీ వ్యాపారులు, చిట్‌ఫండ్ ఏజెంట్ల వేధింపులు తట్టుకోలేక వ్యవసాయ శాఖలో అసిస్టెంట్ అగ్రికల్చరల్ ఆఫీసర్ (ఏఈఓ)గా పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి గుంటోజు బాలరాజు (38) ఆత్మహత్యకు పాల్పడ్డారు.

చిట్యాల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాలరాజు ప్రస్తుతం కేతపల్లి మండలంలో ఏఈఓగా విధులు నిర్వహిస్తున్నారు. కొంతకాలం క్రితం వ్యక్తిగత అవసరాల కోసం కొందరు ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పులు తీసుకున్నాడు. అయితే, అప్పు ఇచ్చిన వారు అధిక వడ్డీలు వేస్తూ, ఖాళీ చెక్కులు మరియు ప్రామిసరీ నోట్లపై ముందుగానే సంతకాలు తీసుకున్నట్లు సమాచారం.గత కొంతకాలంగా డబ్బుల కోసం వడ్డీ వ్యాపారులు, చిట్‌ఫండ్ ఏజెంట్లు తీవ్ర ఒత్తిడి తీసుకువస్తూ బాలరాజును మానసికంగా వేధిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ వేధింపులు భరించలేక బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తీవ్ర మనస్తాపానికి గురైన బాలరాజు తన నివాసంలో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.మృతుడికి భార్య పద్మ, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. మృతుని భార్య గుంటోజు పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిట్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News