Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 04:22 AM

వైకుంఠ ఏకాదశి వేడుకల్లో ప్రత్యేక పూజలు చేసిన సర్పంచ్ సాయికుమార్ దంపతులు

వైకుంఠ ఏకాదశి వేడుకల్లో ప్రత్యేక పూజలు చేసిన సర్పంచ్ సాయికుమార్ దంపతులు

వైకుంఠ ఏకాదశి వేడుకల్లో ప్రత్యేక పూజలు చేసిన సర్పంచ్ సాయికుమార్ దంపతులు
December 30, 2025 05:46 PM 136 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
రామన్న పేట స్థానికం ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం బోగారం గ్రామంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ రామాలయంలో సర్పంచ్ కూనూరి సాయికుమార్, మాధవి దంపతులు ప్రత్యేక పూజలు చేసి భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు.

పూజా కార్యక్రమాల అనంతరం గ్రామపంచాయతీ పరిధిలో పనిచేస్తున్న రెవెన్యూ సిబ్బంది, అధికారులను శాలువాలతో సత్కరించి అభినందించారు. అనంతరం గ్రామంలోని ప్రధాన సమస్యలపై సర్పంచ్ సమీక్ష చేపట్టారు.

వీధి లైట్ల నిర్వహణ, డ్రైనేజీ సమస్యలు, తాగునీటి ఇబ్బందులు తదితర అంశాలపై ఎక్కడ సమస్యలు ఉన్నాయో తన దృష్టికి తీసుకురావాలని వార్డు సభ్యులకు సూచించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొని వైకుంఠ ఏకాదశి వేడుకలను విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News