నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల అనుపమ సంజీవరెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు.శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో నారాయణఖేడ్ నియోజకవర్గం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని వారు స్వామివారిని వేడుకున్నారు. వైకుంఠ ఏకాదశి వంటి పవిత్ర పర్వదినంలో స్వామివారి దర్శనం కలగడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి