Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హమాలి కార్మికుల శ్రమ దోపిడీపై ఆగ్రహం సిఐటియు పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 07:53 AM

ఉపాధి హామీ పనులపై కేంద్ర బృందానికి సమగ్ర వివరణ

ఉపాధి హామీ పనులపై కేంద్ర బృందానికి సమగ్ర వివరణ

ఉపాధి హామీ పనులపై కేంద్ర బృందానికి సమగ్ర వివరణ
February 26, 2026 06:51 PM 78 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ప్రజెంటేషన్ ద్వారా వివరించిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

ఈజీఎస్ పనుల ఫోటో ప్రదర్శన తిలకించిన కేంద్ర ప్రతినిధులు

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం విబి గ్రామ్గాగా మారుస్తున్న నేపథ్యంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ బృందం జిల్లాలో పర్యటిస్తోంది. కేంద్ర బృందం సభ్యులు సంజయ్ కుమార్ నేతృత్వంలో 26-02-2026 నుండి 28-02-2026 వరకు సూర్యాపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్‌తో సమావేశమయ్యారు. జిల్లాలో అమలు చేసిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై కలెక్టర్ సమగ్రంగా వివరించారు. ప్రజెంటేషన్ ద్వారా పనుల పురోగతి, ఖర్చులు, లబ్ధిదారుల సంఖ్య, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి తదితర అంశాలను వివరించారు. జిల్లాలో చేపట్టిన చెరువుల పునరుద్ధరణ, చెక్‌డ్యామ్‌లు, గ్రామ రహదారులు, పచ్చదనం పెంపు కార్యక్రమాలు, మట్టి పనులు వంటి అభివృద్ధి కార్యక్రమాలపై కేంద్ర బృందం సభ్యులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.

అనంతరం జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈజీఎస్ పనుల ఫోటో ప్రదర్శనను కేంద్ర బృందం సభ్యులు, కలెక్టర్ తిలకించారు. ఫోటోల ద్వారా జిల్లాలో అమలు చేసిన పనుల వైవిధ్యం, నాణ్యతను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, ఉప ముఖ్య కార్యనిర్వాహణ అధికారి శిరీష, కేంద్ర బృందం సభ్యులు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News