ఉపాధి హామీ పనులపై కేంద్ర బృందానికి సమగ్ర వివరణ
ఉపాధి హామీ పనులపై కేంద్ర బృందానికి సమగ్ర వివరణ
Biksham Goud
ప్రజెంటేషన్ ద్వారా వివరించిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
ఈజీఎస్ పనుల ఫోటో ప్రదర్శన తిలకించిన కేంద్ర ప్రతినిధులు
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం విబి గ్రామ్గాగా మారుస్తున్న నేపథ్యంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ బృందం జిల్లాలో పర్యటిస్తోంది. కేంద్ర బృందం సభ్యులు సంజయ్ కుమార్ నేతృత్వంలో 26-02-2026 నుండి 28-02-2026 వరకు సూర్యాపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్తో సమావేశమయ్యారు. జిల్లాలో అమలు చేసిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై కలెక్టర్ సమగ్రంగా వివరించారు. ప్రజెంటేషన్ ద్వారా పనుల పురోగతి, ఖర్చులు, లబ్ధిదారుల సంఖ్య, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి తదితర అంశాలను వివరించారు. జిల్లాలో చేపట్టిన చెరువుల పునరుద్ధరణ, చెక్డ్యామ్లు, గ్రామ రహదారులు, పచ్చదనం పెంపు కార్యక్రమాలు, మట్టి పనులు వంటి అభివృద్ధి కార్యక్రమాలపై కేంద్ర బృందం సభ్యులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
అనంతరం జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈజీఎస్ పనుల ఫోటో ప్రదర్శనను కేంద్ర బృందం సభ్యులు, కలెక్టర్ తిలకించారు. ఫోటోల ద్వారా జిల్లాలో అమలు చేసిన పనుల వైవిధ్యం, నాణ్యతను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, ఉప ముఖ్య కార్యనిర్వాహణ అధికారి శిరీష, కేంద్ర బృందం సభ్యులు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి