Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:39 AM

ఉపాధి హామీ పనులకు శ్రీకారం మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశాలతో ఆరుగులపేటలో ప్రారంభం

ఉపాధి హామీ పనులకు శ్రీకారం మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశాలతో ఆరుగులపేటలో ప్రారంభం

ఉపాధి హామీ పనులకు శ్రీకారం మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశాలతో ఆరుగులపేటలో ప్రారంభం
26-02-2026 108 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా చాట్రాయి మండలం ఆరుగులపేటలో ఉపాధి హామీ పథకం పనులు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశాల మేరకు గ్రామ పార్టీ అధ్యక్షులు పానుగళ్ళ కోటేశ్వరావు పనులకు శ్రీకారం చుట్టారు.

గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా, నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దిశగా ఈ పనులు చేపట్టినట్లు ఆయన తెలిపారు. గ్రామంలో అవసరమైన మట్టి రోడ్లు, కాలువల శుభ్రత, చెరువుల పునరుద్ధరణ వంటి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు మంత్రి పార్థసారథికి కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధి హామీ పనుల ద్వారా గ్రామానికి అభివృద్ధితో పాటు కార్మికులకు ఉపాధి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Sthanikam

ఉపాధి హామీ పనులకు శ్రీకారం మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశాలతో ఆరుగులపేటలో ప్రారంభం

Article Image

ఏలూరు జిల్లా చాట్రాయి మండలం ఆరుగులపేటలో ఉపాధి హామీ పథకం పనులు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశాల మేరకు గ్రామ పార్టీ అధ్యక్షులు పానుగళ్ళ కోటేశ్వరావు పనులకు శ్రీకారం చుట్టారు.

గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా, నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దిశగా ఈ పనులు చేపట్టినట్లు ఆయన తెలిపారు. గ్రామంలో అవసరమైన మట్టి రోడ్లు, కాలువల శుభ్రత, చెరువుల పునరుద్ధరణ వంటి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు మంత్రి పార్థసారథికి కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధి హామీ పనుల ద్వారా గ్రామానికి అభివృద్ధితో పాటు కార్మికులకు ఉపాధి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News