ఏలూరు జిల్లా చాట్రాయి మండలం ఆరుగులపేటలో ఉపాధి హామీ పథకం పనులు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశాల మేరకు గ్రామ పార్టీ అధ్యక్షులు పానుగళ్ళ కోటేశ్వరావు పనులకు శ్రీకారం చుట్టారు.
గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా, నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దిశగా ఈ పనులు చేపట్టినట్లు ఆయన తెలిపారు. గ్రామంలో అవసరమైన మట్టి రోడ్లు, కాలువల శుభ్రత, చెరువుల పునరుద్ధరణ వంటి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు మంత్రి పార్థసారథికి కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధి హామీ పనుల ద్వారా గ్రామానికి అభివృద్ధితో పాటు కార్మికులకు ఉపాధి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి