PRINT TIME: June 24, 2026 12:33 AM
ఉపాధి హామీ పనులకు శ్రీకారం మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశాలతో ఆరుగులపేటలో ప్రారంభం
ఉపాధి హామీ పనులకు శ్రీకారం మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశాలతో ఆరుగులపేటలో ప్రారంభం
February 26, 2026 04:32 PM
100 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
ఏలూరు జిల్లా చాట్రాయి మండలం ఆరుగులపేటలో ఉపాధి హామీ పథకం పనులు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశాల మేరకు గ్రామ పార్టీ అధ్యక్షులు పానుగళ్ళ కోటేశ్వరావు పనులకు శ్రీకారం చుట్టారు.
గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా, నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దిశగా ఈ పనులు చేపట్టినట్లు ఆయన తెలిపారు. గ్రామంలో అవసరమైన మట్టి రోడ్లు, కాలువల శుభ్రత, చెరువుల పునరుద్ధరణ వంటి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు మంత్రి పార్థసారథికి కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధి హామీ పనుల ద్వారా గ్రామానికి అభివృద్ధితో పాటు కార్మికులకు ఉపాధి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి