ఉగ్గేల్లి గ్రామంలో గాయపడిన బీజేపీ కార్యకర్తలను పరామర్శించిన ఎమ్మెల్సీ అంజిరెడ్డి
ఉగ్గేల్లి గ్రామంలో గాయపడిన బీజేపీ కార్యకర్తలను పరామర్శించిన ఎమ్మెల్సీ అంజిరెడ్డి
Sthanikam District Staff Reporter krishna
సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి కృష్ణ
:ఉగ్గేల్లి గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్తలు బర్దిపురం శంకర్, భూతపిల్లి సంతోష్ ఎంజి నాగరాజ్ ఎన్నికల ముందు జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడగా, ఎమ్మెల్సీ చిన్న మైల్ అంజిరెడ్డి వారిని పరామర్శించారు. గాయపడిన కార్యకర్తల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆయన, వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు గోదావరి అక్క, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దేశ్ పాండే, జిల్లా జనరల్ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ముత్తిరెడ్డి, గొల్ల భాస్కర్, కిసాన్ మోర్చా జనరల్ సెక్రటరీ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. అలాగే జహీరాబాద్ మండల అధ్యక్షులు ఎం.జి దుర్గయ్య, కోహీర్ మండల అధ్యక్షులు తలారి వైద్యనాథ్, ఝారా సంఘం మండల అధ్యక్షులు బంటు విశ్వనాథ్, పట్టణ అధ్యక్షులు పూల సంతోష్తో పాటు రమేష్ రెడ్డి, నరేష్, చల్ల ప్రభాకర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి