ఉగాది సందర్భంగా ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి పంచమ జ్యోతుల మహోత్సవం
ఉగాది సందర్భంగా ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి పంచమ జ్యోతుల మహోత్సవం
EDIGA NAVEENKUMAR
మార్చి 19న తెల్లవారుజామున 3 గంటలకు జ్యోతి మహోత్సవం
శ్రీ సత్యసాయి జిల్లా లోని సోమందేపల్లి గ్రామంలో వెలసి భక్తుల కోర్కెలను తీర్చే అమ్మవారిగా ప్రసిద్ధి చెందిన శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించనున్న శ్రీ చౌడేశ్వరి దేవి పంచమ జ్యోతుల మహోత్సవం కార్యక్రమానికి ఆలయ కమిటీ సన్నాహాలు ప్రారంభించింది.
శ్రీ పరాభవ నామ సంవత్సరం విదియ, తేదీ 19-03-2026 గురువారం తెల్లవారుజామున రాత్రి 3.00 గంటలకు జ్యోతి మహోత్సవం ఘనంగా నిర్వహించబడునని ఆలయ కమిటీ అధ్యక్షులు డి.సి. ఈశ్వరయ్య తెలిపారు.
జ్యోతులకు దాతలుగా ముందుకు రావాలనుకునే భక్తులు తమ పేర్లు 24-02-2026 లోపు నమోదు చేసుకుని నగదు చెల్లించవలసిందిగా శ్రీ చౌడేశ్వరి జ్యోతి సేవ సమితి సభ్యులు విజ్ఞప్తి చేశారు. సమస్త కుల బాంధవులు ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి